Nadendla Manohar : ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా మారిందో మనం చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మూడు పార్టీలు ప్రచారంలో జోరెక్కిస్తున్నాయి. విశాఖపట్నంలోని టైకూన్ జంక్షన్ వ్యవహారం రాజకీయంగా ముదురుతోంది. టైకూన్ కూడలి మూసివేత అంశంపై జనసేన పోరాటం ఉద్ధృతం చేస్తోంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిల్డింగ్కు వాస్తు దోషం ఉంటే రోడ్డును మూసేస్తారా అంటూ ప్రశ్నిస్తున్న జనసేన నేతలు సోమవారం.. నిరసన చేపట్టారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దీనికి మద్దతు ప్రకటించారు. వాస్తుదోషం ఉందనే కారణంతో టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గాన్ని మూసివేశారంటూ వైజాగ్ నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మనోహర్ ఆందోళనకు దిగారు.
‘మన బడి- నాడునేడు’ పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కేంద్రం సహా వివిధ సంస్థలు ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేశారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో 2 వేల 253 కోట్ల రూపాయలు దారిమళ్లాయని ఆరోపణలు చేశారు. నాడు-నేడు కార్యక్రమంలో 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదని… కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని మనోహర్ విమర్శించారు. అయితే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే నిరసన తెలిపి ఆ కూడలిని తెరవాలని కోరిన మా నేత నాదెండ్ల మనోహర్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా? అంటూ పవన్ మండిపడ్డారు.
ప్రజల సమస్యలు తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసు అధికారులు అందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏంటని పవన్ నిలదీశారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తుందని, ఇందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…