Mukesh Ambani : ఇటీవలి కాలంలో సెలబ్రిటీలకి బెదిరింపు కాల్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తమకు రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ముకేశ్ అంబానీకి మెయిల్ వచ్చిందని వెల్లడించారు. తమ వద్ద బెస్ట్ షూటర్స్ కూడా ఉన్నట్లు మెయిల్లో హెచ్చరించారని అధికారులు పేర్కొన్నారు. షాదాబాద్ ఖాన్ పేరుతో ఉన్న మెయిల్ నుంచి అక్టోబర్ 27వ తేదీన బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ పంపినట్టు చెబుతున్నారు.
రిలయన్స్ ఫౌండేషన్ ఆధీనంలో నడుస్తోన్న ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందిన కొద్దిరోజుల్లోనే ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు ఘటనలు ముంబైలో కలకలం రేపాయి. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు. గతంలో కూడా ముఖేష్ అంబానీకి బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. 2021లో ఆయన నివాసం అంటాలియాకు అత్యంత సమీపంలో కారును పార్క్ చేసిన ఉదంతం అనేక మలుపులు తిరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఇది కేవలం గ్లింప్సెస్ మాత్రమే అనే బెదిరింపు లేఖనూ పోలీసులు ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడు మరోసారి బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము అడిగిన 20 కోట్ల రూపాయలను ఇవ్వకపోతే షూట్ చేసి చంపుతామంటూ అజ్ఞాత వ్యక్తులు ముఖేష్ అంబానీకి ఇ-మెయిల్ పంపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 27వ తేదీన ఈ ఈ-మెయిల్ ఆయనకు వచ్చింది. దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గమ్దేవి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…