OTT : ప్రతి వారం ఓటీటీలో పలు చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నాయి. గత వారం ‘రావణాసుర’, ‘మీటర్’ సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం సైతం పలు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు చిన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఓటీటీ లో అలరించనున్న సినిమాల విషయానికి వస్తే.. దాస్ కా ధమ్కీ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ ఏప్రిల్ 14న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతోంది. నివేదా పేతురాజ్, హైపర్ ఆది, మహేష్, రావు రమేష్, రోహిణి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
మార్చి 22న విడుదలైన ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ‘ఆహా’లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఓ కల అనేది చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందగా, ఈ మూవీ ఏప్రిల్ 13 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించారు. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ప్రేమ ఉన్నా, ఆ విషయాన్ని చెప్పకపోవడంతో ఎంత నరకం అనుభవించాల్సి ఉంటుందో ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. కన్నడ భాషకి చెందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కబ్జా చిత్రం అమెజాన్ ప్రైమ్లో ఏప్రిల్ 14 నుండి స్ట్రీమ్ కానుంది.
ఇక రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అసలు చిత్రం గురువారం( ఏప్రిల్ 13)న ఓటీటీలో సందడి చేయనుంది. ఈటీవీ విన్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. నటి పూర్ణ లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్గా రూపొందింది. ఇక ది మార్వెలస్ మిస్సెస్ అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కు రానుంది. రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించిన ‘మిస్సెస్ అండర్కవర్’ అనే హిందీ చిత్రం ఏప్రిల్ 14న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…