Mokshagna : సినీ పరిశ్రమలో వారసుల రచ్చ కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక బాలయ్య తనయుడు ఎంట్రీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు బాలయ్యను ఎలా అయితే సినీ పరిశ్రమకు తీసుకొచ్చారో.. ఇప్పుడు బాలయ్య కూడా తన దర్శకత్వంలో కొడుకుని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఆదిత్య 369 సీక్వెల్ గా రాబోయే ‘ఆదిత్య 999 మ్యాక్స్’ ప్రాజెక్టుతోనే మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఉండబోతుందని సమాచారం.
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలోనే బాలయ్య స్వయంగా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.. అంతక ముందు బాలయ్య ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారట. మోక్షజ్ఞకు బాలయ్య ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట. తన చిత్రాల సెట్స్ కి తీసుకెళ్లి… కెమెరాను ఎలా ఫేస్ చేయాలి, డైలాగ్ డెలివరీ వంటి విషయాల్లో శిక్షణ ఇస్తున్నాడని తెలుస్తుంది. ఇక నలుగురిలో బెరుకు లేకుండా ధైర్యంగా ఉండేలా కుమారుడిని తీర్చిదిద్దుతున్నాడట. వీరసింహారెడ్డి, అనిల్ రావిపూడి మూవీ సెట్స్ లో మోక్షజ్ఞ కనిపించడానికి కారణం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తలే నిజమైతే 2023 బాలయ్య అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడంతో పాటు తన సినిమాని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ‘వీరసింహారెడ్డి’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వీర సింహారెడ్డి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో బాలయ్య జాయిన్ అయినట్టు తెలుస్తోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…