Mohan Babu : ఏ వేడుక అయిన సరే మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం ఆ వేదికపై తెగ సందడి చేస్తూ ఉంటారు. స్టేజ్పై ఉన్నంత సేపు అందరి అటెన్షన్ తమపై పడేలా చూసుకుంటారు. మంచు విష్ణు నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘జిన్నా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా జరగగా, ఈ ఈవెంట్కి మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మోహన్ బాబు.. ‘ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాను. 75 సినిమాలను నిర్మించాను. శివాజీగారి ఫంక్షన్స్లో, మా అన్నయ్య ఎన్టీఆర్గారి ఫంక్షన్లో , నాగేశ్వశ్వర రావు ఫంక్షన్లో కృష్ణ, కృష్ణంరాజు ఫంక్షన్స్లో.. అబ్దుల్ కలామ్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు కూడా ఎవరు నాకు ఏం చెప్పలేదు.
కాని విష్ణు మాత్రం నా దగ్గరకు వచ్చి నాన్న మీరు తక్కువగా మాట్లాడాలి అని అన్నాడు. బిడ్డను పది మందిలో పొగడకూడదనేది శాస్త్రం. విష్ణు ఎంత బాగా నటించాడనేది సినిమాలో నటించిన వారు, టెక్నీషియన్స్ చెప్పారు. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. సినిమా తప్పక విజయం సాధిస్తుంది. చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ అని చెప్పారు మోహన్ బాబు .ఇక తన స్పీచ్ అనంతరం.. ఈవెంట్ చివరి క్షణాల్లో తన మనవడు అర్వం తో కలిసి స్టేజీపై స్టెప్పులేశారు. ‘నువ్వొస్తావని నేను..’ అనే జానపద పాటకు మనవుడు, మోహన్ బాబు కలిసి తెగ చిందులేశారు.
మధ్యలో అలీ కూడా అర్వంతో కాలు కదిపాడు. అనంతరం బుడతడు ఒక్కడే డ్యాన్స్ చేస్తుండగా, అది చూసి మోహన్ బాబు తెగ సంతోషపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటం విశేషం. ఇక జిన్నా విషయానికి వస్తే ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. గ్లామర్ బ్యూటీలు పాయర్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ కూడా ముఖ్య పాత్రలో అలరించనున్నారు. అక్టోబర్ 21న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…