ఒకప్పుడు వరుస సినిమాలతో అలరిస్తూ వస్తున్న మంచు మనోజ్ కాస్త బ్రేక్ ఇచ్చాడు.అయితే ఇటీవల తన రెండో పెళ్లి విషయంతో వార్తలలో నిలుస్తున్నాడు. నంద్యాల పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికతో కలిసి ఇటీవల తరచుగా కనిపిస్తున్నారు మనోజ్. గత ఏడాది వినాయక చవితి పండుగ దినాల్లో మౌనిక-మనోజ్ కలిసి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు వినాయక మండపాన్ని సందర్శించారు. ఆ ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. భూమా నాగిరెడ్డి జయంతి పురస్కరించుకొని మనోజ్ ఓ ట్వీట్ వేశారు. వరుస పరిణామాల నేపథ్యంలో మౌనిక-మనోజ్ ల వివాహం ఖాయమే అన్న వాదన మొదలైంది.
తాజాగా మంచు మనోజ్ మరో రెండు రోజుల్లో తన జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన వార్తను అందరితో పంచుకుంటానని అంటున్నాడు. తన మొదటి చిత్రం ‘దొంగ దొంగది’లోని ‘మన్మథ రాజా’ పాటకు సంబంధించిన జిఫ్ వీడియోను షేర్ చేస్తూ.. ‘నా హృదయానికి హత్తుకునే ఓ ప్రత్యేకమైన వార్తను గత కొంతకాలంగా నాలోనే దాచుకున్నా. జీవితంలోని మరో దశలోకి అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పటిలానే మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని మనోజ్ తన ట్వీట్లో రాసుకురాగా, ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
మంచు మనోజ్ 2004లో ‘దొంగ దొంగది’ మూవీ ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టగా, ఆ తర్వాత ‘శ్రీ’, ‘రాజుభాయ్’, ‘నేను మీకు తెలుసా’ వంటి భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. 2018లో ‘అపరేషన్ 2019’ మూవీ తర్వాత మళ్లీ మనోజ్ సినిమాలకు సైన్ చేయలేదు. 2015లో తన గర్ల్ఫ్రెండ్ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్.. 2019లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. ఇక త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంని, భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ ఏడడుగులు వేయడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…