గుర్తు తెలియని వ్యక్తులకు, ఇంటర్నెట్లో పరిచయం అయ్యేవారికి డబ్బు పంపవద్దని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. చాలా మంది ఇలా మోసపోతున్నా ఇంకా కొందరికి మాత్రం జ్ఞానోదయం కావడం లేదు. ఎవరో తెలియని వారికి డబ్బులు పంపుతూ లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఆన్లైన్లో ఓ వెబ్సైట్ను చూస్తుండగా.. కాల్ గర్ల్స్ సరఫరా చేస్తామంటూ ఓ ఫోన్ నంబర్ కనిపించింది. దీంతో ఆ నంబర్కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తి తనను తాను కుమార్గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హోటల్లో ముందుగా రూమ్ తీసుకోవాలని, అలాగే అమ్మాయి సేఫ్టీ, ఇతర ఖర్చుల కోసం కావాలని చెప్పి ఆ యువకుడి నుంచి విడతల వారిగా మొత్తం రూ.7.84 లక్షలను ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. అయితే తరువాత ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు అక్కడి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ లో ఇలా పరిచయం అయ్యేవారికి, గుర్తు తెలియని వారికి డబ్బులను అసలు పంపకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…