Mallareddy : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎంత వాడివేడిగా సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సభలో శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించగా.. వాటిని హరీశ్ రావు, కడియం శ్రీహరి వాటికి సమాధానం చెప్తూనే ప్రతి విమర్శలు చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో సభ మొత్తం వేడి వేడిగా ఉన్న సమయంలో.. మాజీ మంత్రి మల్లారెడ్డి అందరి ముఖాల్లో నవ్వులు పూయించారు.
ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా తెలంగాణలో సుమారు 26వేల పెళ్లిళ్లు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండ్రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి రిక్వెస్ట్ను విన్న స్పీకర్తో పాటు అటు సభ్యుల ముఖాల్లో కూడా నవ్వులు కనిపించాయి. నిజానికి.. మల్లారెడ్డి చేసిన రిక్వెస్ట్లో కూడా అర్థం ఉంది. అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగేదే.. ప్రభుత్వాలు, ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చ, వాళ్లు చేసే తీర్మానాలు, చట్టాల గురించి తెలుసుకునేందుకు. అలాంటిది.. ప్రజలంతా పెళ్లిళ్లు, పేరంటాలంటూ ఫంక్షన్ హాళ్ల వెంట తిరిగితే.. సమావేశాలు వీక్షించేదెవరు. అందుులోనూ ఏకంగా 26 వేల పెళ్లిల్లంటే.. మామూలు విషయం కాదు.
రాష్ట్రమంతా పెళ్లి సందడే ఉంటుంది. ఈ రకంగా చూస్తే.. మల్లన్న చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. మరి.. ఆ రెండు రోజులు సభను కొనసాగిస్తారా.. మల్లన్న రిక్వెస్ట్ మీద.. సెలవులు ప్రకటిస్తారా అన్నది చూడాలి. గతంలోనూ.. మల్లారెడ్డి ఇలాగే పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. మంతినయ్యా అంటూ డైలాగ్ చెప్పి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ డైలాగ్తో మల్లన్న ఇంకెంత పాపులర్ అవుతాడో చూడాలి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అంతా కలిసి మేడిగడ్డను సందర్శించడానికి వెళ్దామని చెబుతుండగా.. బీఆర్ఎస్ మాత్రం దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…