గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్తో పాన్ వరల్డ్ ప్రేక్షకులను ఈ చిత్రంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ‘ఎస్ఎస్ఎంబీ29’ విడుదలయ్యే దాకా తన గత చిత్రాలను హిందీలోకి డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు సమాచారం. ఇప్పటి వరకు మహేశ్ నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు. దీంతో బాలీవుడ్లో ఇదే తన తొలి చిత్రమవుతుందని ఆసక్తిగా ఉన్నారు.
కాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉండగా మహేష్ బాబు తన కొత్త లుక్ లోకి మారే పనిలో ఉన్నాడు. అలాగే వచ్చే ఏడాది నుంచి అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోనుందట. వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేసుకుంటుంది అని అలాగే ఒక గ్లొబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇది రాజమౌళి ఎప్పుడో ఆపేసిన ప్రాజెక్ట్ “గరుడ” అంటూ కూడా పలు రూమర్స్ ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అయితే దుర్గ ఆర్ట్స్ వారు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారని ఒక అంచనా.
అయితే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్కి కాస్త బ్రేక్ తీసుకొని న్యూయార్క్ వెళ్లారు. వెకేషన్ పూర్తి కాగానే తిరిగి హైదరాబాద్లో అడుగుపెట్టారు. కూతురు సితారతో కలిసి మహేష్ బాబు ఎయిర్ పోర్ట్లో నడుస్తూ వస్తుండగా, అందుకు సంబంధించిన లుక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. రెడ్ క్యాప్, క్యాజువెల్ వేర్, జులపాల గడ్డంతో మహేష్ బాబు లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…