ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక ప్రభుత్వానికి పలువురు ప్రముఖులు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. సోమవారం విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఆయన కలిశారు. వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ అధినేతను సీఎం చంద్రబాబు అభినందించారు.
75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం కష్టపడుతున్నారని కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. విపత్తు వేళ ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు.మరోవైపు కొవిడ్ సమయంలోనూ కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ఏపీకి భారీ విరాళం అందించారు. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు. ఇప్పుడు మరోసారి విపత్తు వేళ అండగా నిలిచారు. ఇక వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పోటెత్తుతున్నాయి. రంగాలకు అతీతంగా విరాళాలు అందిస్తున్నారు. సినీ రంగం నుంచి చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖులతో పాటుగా చిన్న నటులు కూడా తమకు తోచినైన స్థాయిలో విరాళం అందించారు.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వంటి నేతలు కూడా భారీగా విరాళాలు ఇచ్చారు.ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సాయం వారు చేయాలి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఎవరికి తోచినంత వారు సాయం అందిస్తే ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటుందని కిరణ్ కుమార్ అన్నారు. కాగా, వరద బాధితుల సహాయార్థం టీడీపీ నేత అంగర్ రామ్మోహన్ రావు విరాళం అందించారు. విజయవాలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఆయనను సీఎం చంద్రబాబు అభినందించారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…