లలిత జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టీవీల్లో తన కంపెనీకి సంబంధించి ప్రచారాలని వినూత్నంగా చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు కిరణ్.ఎన్నో కంపెనీలకు మరియు ప్రొడక్ట్స్కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం.అయితే లలిత జ్యూవెలరీ యాడ్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు మోడల్స్ ఉండరు, అందాల ముద్దుగుమ్మలు ఆ యాడ్స్లో కనిపించరు, లలిత జ్యూవెలర్స్ కంపెనీకి తానే ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కిరణ్ కుమార్ అందరి దృష్టిని ఆకర్షించాడు. నా కంపెనీకి నేనే అంబాసిడర్గా వ్యవహరిస్తాని మొదలు పెట్టిన ఆయన అనూహ్యంగా గుర్తింపు దక్కించుకున్నాడు.
ఎక్కువ శాతం మంది ఆయన మాట తీరును చూసి తెలుగు వ్యక్తి కాదని అనుకుంటారు..కాని ఆయన పక్కా తెలుగు వ్యక్తి.నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అయితే తమిళనాడుకు కాస్త దగ్గరగా ఉండటం వల్ల భాష మరియు యాసలో కాస్త తేడాగా ఉంటుంది.కిరణ్ కుమార్ నెల్లూరులో బంగారపు వస్తువులు తయారు చేసే వర్క్ షాపులో నెల సరి జీతానికి పని చేసేవాడు. వ్యాపారవేత్తగా ఎంతో సక్సెస్ అయి కోట్లాది ఆస్తులకు అధిపతి అయ్యారు. అయితే తాను ఇంత సక్సెస్ కావడానికి కారణం మహానటి సావిత్రి అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
చెన్నైలో మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడే వ్యాపారాన్ని విస్తరించానని అన్నాడు కిరణ్ కుమార్. సావిత్రి పిల్లలు ఆమె పేరు మీద ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, దాన్ని రెంటుకు తీసుకొని బంగారం షాప్ మొదలు పెట్టానని, సావిత్రి ఆశీర్వాదం వల్లే నా వ్యాపారం బాగా నడిచిందని ఇంత పెద్ద సక్సెస్ అయ్యానని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆమె పేరు మీదే బిల్డింగ్ ఉందని తెలియజేశారు. అది కేవలం లలిత కార్పొరేట్ ఆఫీస్ అని మాత్రమే రాశాము కానీ సావిత్రి గణేష్ గారి పేరు మీదే ఉంచామని తెలియజేశాడు. ఓ సందర్భంలో సావిత్రి కూతురు చాముండేశ్వరి మాట్లాడుతూ.. అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్ ది బంగారం షాపు. అమ్మకు కార్లు అంటే ఇష్టం. కిరణ్ కు కూడా చాలా ఇష్టం. ఈ విధంగా అభిప్రాయాలు కలవడంతో ఆయనకు అమ్మేశామని చెప్పుకొచ్చింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…