వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలకృష్ణ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని తొక్కినేని అంటూ నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరుపై ఎ.ఎన్.ఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. అలానే దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. బాలయ్య తప్పుగా మాట్లాడరని, ఆయన సారీ చెప్పాలంటూ పలువురు ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్కినేని నాగ చైతన్య ,అఖిల్ కూడా ఈ విషయంపై కాస్త ఘాటుగానే స్పందించారు. అయితే ఈ వివాదంపై బాలయ్య ఏమైన స్పందిస్తారా అని అందరు ఎదురు చూస్తున్న సమయంలో ఎట్టకేలకు స్పందించారు.
హిందూపురంలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బాలకృష్ణ.. ‘‘నాపై జరిగే ట్రోలింగ్ను నేను పట్టించుకోను. నా గురించి అంతా తెలుసు. అవకాశంగా తీసుకుని ట్రోల్ చేస్తున్నారు. కానీ.. నేనెంటో ప్రజలకు తెలుసు. రామారావుగారిని ఎన్టీవోడు అని అంటారా లేదా.. అలాగే నాగేశ్వరరావుగారిని నాగయ్యగారు అని అంటారు. రాష్ట్రంలో ఒక్కొక్క యాస, అభిమానంతో పిలుస్తుంటారు. నేను కూడా ప్రచారానికి వెళ్లినప్పుడు నన్ను చూసి ఏదో ఒక పేరుతో వెళ్లిపోతున్నాడురా అని అంటారు. కూలీ పని చేసుకునేవాళ్లు… వాళ్లు వీళ్లు అభిమానంతో పిలుచుకుంటారు.
మనకు ఆప్తులైన వారిని మనం అలాగే పిలుచుకుంటాం. ఉదాహరణకు తాడో పేడో అంటాం. అందులో పేడోకి అర్థమేంది. ఏదేమైనా నాగేశ్వరరావుగారు నాకు బాబాయే. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. సొంత పిల్లల కంటే నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. మా మధ్య అంత ఆప్యాయత ఉంది. ఇండస్ట్రీకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. నాన్నగారి నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటే..బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండటాన్ని నేర్చుకున్నాను. నాన్నగారి పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును ముందుగా నాగేశ్వరరావుగారికే ఇచ్చాం’’ అని చెప్పుకొచ్చారు బాలయ్య. . బాబాయ్పై ప్రేమ గుండెల్లో ఉంటుందని.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోనవసరం లేదని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…