Kriti Sanon : ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రలలో ఓంరౌత్ తెరకెక్చించిన చిత్రం ఆదిపురుష్. కృతి సనన్ విషయానికి వస్తే.. వన్ నేనొక్కడినే మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు హిందీలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటి ఆదిపురుష్ మూవీతో తెలుగులోనూ అలరించనుంది. ఇక తాజాగా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది కృతి సనన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బ్లాక్ సారీలో ఎంతో అందంగా కృతి సనన్ దర్శనం ఇచ్చింది. అలాగే ఇందులో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటి.
నా కెరీర్ తెలుగులోనే మొదలైంది. 9 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నాను. జానకి పాత్ర చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. అందుకు ఓం రావత్, ప్రభాస్ లకు ధన్యవాదాలు. నిజానికి ఆ సీత పాత్రే నన్ను ఎంచుకుందని నేను భావిస్తున్నాను. నా జీవితంలో ఆదిపురుష్ ప్రత్యేకంగా నిలిచిపోతుంది” అని కృతి సనన్ తెలిపింది.సాధారణంగా సినిమా సెట్స్ లో గోలగోలగా ఉంటుంది.. కానీ ఆదిపురుష్ సెట్లో ఒక ప్రశాంతత వాతావరణం నెలకొంది. రామాయణం చేస్తున్నామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేది. అందుకే నిశబ్దంగా ఉండేవారు. ఆ వాతావరణం నాకు ఎంతగానో నచ్చింది” అని కృతి సనన్ పేర్కొంది. తర్వాత ప్రభాస్ గురించి చెప్పమని హీరోయిన్ కృతిని యాంకర్ ప్రదీప్ కోరాడు.
: “ప్రభాస్ స్వీట్ అండ్ కైండ్ పర్సన్. ఆయన పెద్దగా మాట్లాడరు అని అందరూ అంటారు. కానీ అది నిజం కాదు. ప్రభాస్ చాలా బాగా మాట్లాడతారు. ఆయనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇది అందరికి తెలిసిందే. ఆయన కళ్లలో ఓ ప్రశాంతత ఉంటుంది. రాఘవుడు పాత్రను ప్రభాస్ తప్ప మరొకరు చేయలేరు” అని కృతి సనన్ చెప్పుకొచ్చిం ది. ఈ అమ్మడు ‘1 నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు ఆమె ఏ భాషలో కూడా ఏ సినిమా చేయలేదు. ఆ తరువాత కూడా ఆమె తెలుగులో ‘దోచేయ్’ చేసింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడం వలన, ఆమె పూర్తిగా బాలీవుడ్ సినిమాలపైనే దృష్టిపెట్టింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…