Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్తో మంచి సాన్నిహిత్యంగా ఉండేవారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి కాగా, అప్పటికే ఎంతో మంది హీరోలున్న తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్గా ఎదిగారు. హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయారు. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి రెబల్ స్టార్ కృష్ణంరాజుకి మధ్య ఎంతో అనుబంధం ఉంది. కృష్ణంరాజుని చిరు అన్నయ్య అని సంభోదిస్తుంటారు.
ఇద్దరిదీ ఒకే ఊరు (మొగల్తూరు) అవ్వడంతో కృష్ణంరాజుకి చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. చిరంజీవి సినిమాల్లోకి వచ్చేసరికే కృష్ణంరాజు పెద్ద స్టార్. చిరు కెరీర్ స్టార్టింగ్ లోనే కృష్ణంరాజుతో కలిసి పనిచేసే అవకాశం రాగా, ఆ తర్వాత చిరంజీవి క్రమక్రమంగా మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి సక్సెస్ ను చూసి అందరికంటే ఎక్కువ ఆనందపడింది ఇండస్ట్రీలో కృష్ణంరాజు అని చెబుతుంటారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఎంత అనుబంధం అంటే చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరడమే కాక రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసారు కృష్ణంరాజు.
ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి, కృష్ణంరాజు మనసు ఎంత స్వచ్ఛమైందో తెలపడానికి దీనిని ఒక ఉదాహరణగా చెప్పుకుంటారు.. వివరాలలోకి వెళితే దాదాపు 35 ఏళ్ల కిందట లండన్ నుండి ఒక ఖరీదైన కెమెరా తెప్పించారు కృష్ణంరాజు. చిరంజీవి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఆ కెమెరా చూసి ఆశ్చర్యపోయాడట. “అన్నయ్య, లండన్ లో ఈ కెమెరా చూసాను. చాలా ఖరీదుగా ఉందని వదిలేసాను” అని చిరంజీవి అనడంతో వెంటనే కృష్ణంరాజు ఆ కెమెరాను చిరంజీవి మెడలో వేసి ఇది నీకే అనేసారట. దాంతో చిరు ఆశ్చర్యపోయి ఆనందభాష్పాలు కూడా కార్చాడని టాక్.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…