Konda Surekha : అంద‌రి ముందే కొండా సురేఖ‌, ప‌ల్లా మ‌ధ్య వాగ్వాదం.. ఉంటే ఉండండి, లేక‌పోతే వెళ్లండి..!

Konda Surekha : ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మ‌ధ్య పోటీ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండ సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నుంచి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదకు పిలిచే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. సిద్దిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ నేతను స్టేజీ పైకి పిలిచారు. ఓడిపోయిన వారిని స్టేజీ మీదకి ఎలా పిలుస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పల్లా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై హరిత హోటల్లో ప్రభుత్వ అధికారిక సమీక్షలో కాంగ్రెస్‌ నేత కొమ్మూరిని స్టేజీపైకి పిలిచారు మంత్రి కొండా సురేఖ. అయితే దీనికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఇక్కడ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదని.. రాజకీయ వేదిక లాగా ఓడిపోయిన వారిని స్టేజీపైకి ఎలా పిలుస్తారంటూ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Konda Surekha and palla rajeshwar reddy argued in a program
Konda Surekha

మొదట మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే పల్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ నేత వినలేదు. దాంతో విసుగు చెందిన కొండా సురేఖ.. మీరు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపొండి అని చెప్పేశారు. తన మాటలకు విలువ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ సమావేశంలాగ ఓడిన వారిని స్టేజీపైకి ఎలా పిలుస్తారంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కొమరవెల్లి మల్లన్న జాతర సమీక్ష సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు మళ్లీ మొదలైందని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశాన్ని హోటల్లో పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తమ హయాంలో ఇలా ఎప్పుడూ రాజకీయాలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago