Priya Atluri : వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల కాబోయే మనుమరాలికి వైఎస్ విజయమ్మ చీర, గాజుల సారెతో స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. అమెరికాలో ఉంటున్న ప్రియా అట్లూరి అనే యువతితో రాజారెడ్డి పెళ్లి నిశ్చయించారు. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం.పై చదువుల నిమిత్తం అమెరికాలో ఉంటున్న రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.
ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఓకే చెప్పడంతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు అయినా ప్రేమించుకోవడంతో ఇంట్లో పెద్దలు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఇక వైఎస్ షర్మిల కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వైఎస్ షర్మిలకు ముందు తన మేనమామ చంద్ర ప్రతాప్ రెడ్డితో వివాహం జరిగింది. అనంతరం షర్మిలకు బ్రదర్ అనిల్ తో రెండో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అయితే ప్రియా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనే ప్రియా-రాజా రెడ్డి కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చినప్పుడు.. ఆమె చట్నీస్ హెటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలుగా ప్రచారం సాగింది.కానీ కొందరు మాత్రం.. ప్రియా అట్లూరి.. బ్రదర్ అనిల్ స్నేహితుడు శ్రీనివాస్ అట్లూరి కుమార్తె అన్నారు. బ్రదర్ అనిల్కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారు. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.
అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తెనే ఈ ప్రియా అని కొందరు అంటున్నారు. పైగా జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ ప్రియ మెస్ యజమానులు ప్రియ మేనమామలు అని కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. ప్రియా కుటుంబం ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారని.. ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉందని అంటున్నారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని సమాచారం. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…