Kodali Nani : రాజకీయాలకి చాలా దూరంగా ఉండే చంద్రబాబు సతీమణి తన భర్త అరెస్ట్ అయ్యాక మాత్రం బయటకు వచ్చి తన భర్త తరపున మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది. ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చుక్కెదురు కావటంతో తండ్రి చంద్రబాబు బెయిల్ కోసం లోకేశ్ ఢిల్లీలోనే ఉన్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన క్రమంలో ఢిల్లీలోనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబు రిమాండ్ను కోర్టు మరో 11 రోజులు పొడిగించింది. అయితే.. జైల్లో ఉన్న చంద్రాబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెంనాయుడు ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ అనంతరం భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి కొడాని నాని సెటైర్లు వేశారు.
జైల్లో చంద్రబాబు తినేందుకు కనీసం టేబుల్ అయినా వేయలేదని.. ఆయనకు దోమలు కుడుతున్నాయంటూ.. భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి నాని.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జైల్లో దోమలు కాకుండా రంభా, ఉర్వశి వచ్చి ఆయనకు కన్నుకొడతాయా అంటూ సైటైర్లు వేశారు కొడాలి నాని. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎవరికైనా జైలులో ఒకే ట్రీట్ మెంట్ ఉంటుందని తెలిపారు. అలా కాదు.. తనకు ఆరోగ్యం బాలేదనో.. లేదా ఇంకేదైనా సమస్య ఉందని కోర్టుకు విన్నవించుకుంటే అందుకు తగినట్టుగా న్యాయస్థానం కొన్ని వసతులు కల్పించే అవకాశం ఉంది. అలా కోర్టు చెప్పిన సౌకర్యాలే జైల్లో ఉంటాయని చెప్పారు.
చంద్రబాబు చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారని, భోజనం చేసేందుకు టేబుల్ కూడా లేదని భువనేశ్వరి బాధపడతున్నారని.. ఆయనకు వేడి నీళ్లు ఇవ్వాలని, టేబుల్ వేయాలని న్యాయస్థానం చెప్తేనే ఇస్తారంటూ కొడాలి నాని అన్నారు. ఇక జైల్లో ఆయనను దోమలు కుడుతున్నాయని అంటున్నారని.. మరి దోమలపై ఆయన దండయాత్ర చేశారు కదా.. అవేమైన పగ తీర్చుకుంటున్నాయేమో పంచులు పేల్చారు.ఇక జైలుకు వెళ్లిన ప్రతీ ఒక్కరికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరి బాబు జైలుకు వెళ్లకుండా.. ప్రియా పచ్చళ్ల కోసం మామిడి కాయలు కొట్టేందుకు వెళ్లాడా అంటూ తనదైన శైలిలో సెటైర్స్ వేశారు కొడాలి నాని.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…