Dochevaarevarura Movie : థియేటర్స్లో రిలీజైన సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో థియేటర్స్ కన్నా ఓటీటీ వైపే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. నేటి నుండి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దోచేవారెవరురా స్ట్రీమింగ్ కాబోతుంది. మనీ, మనీ మనీ వంటి క్రైమ్ కామెడీ సినిమాలతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నాగేశ్వరరావు ఈ మూవీని తెరకెక్కించారు. ఈయన వన్ బై టూ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, ధనలక్ష్మీ ఐలవ్యూ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ఫొటో, భూ కైలాస్ వంటి సినిమాలు కూడా తీసారు.
14 ఏళ్ల పాటు సినిమాలకి దగ్గరగా ఉన్న శివనాగేశ్వరరావు మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నారు. తనకిష్టమైన జోనర్లోనే దోచేవారెవరురా వంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ను తెరకెక్కించారు. ఇందులో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, ప్రణవ్ చంద్ర, మాళవికా సతీషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చి 11న థియేటర్లలో విడుదలైన దోచేవారెవరురా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. చాలా గ్యాప్ తర్వాత తీసిన ఈ సినిమా ఆయనని ఎంతగానో నిరాశపరచింది. థియేటర్ రిలీజ్ తర్వాత సుమారు ఆరు నెలలకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సెప్టెంబర్ 29 నుంచి దోచేవారెవరురా స్ట్రీమింగ్ అవుతుంది.
2009లో నిన్ను కలిశాక సినిమా తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు శివనాగేశ్వరరావు. దాదాపు 14 ఏళ్ల పాటు సినిమాలు తీయలేదు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా కూడా ఇది చాలా నిరాశపరచింది. ఇందులో తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, బెనర్జీ వంటి సీనియర్ నటులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్పై బొడ్డు కోటేశ్వరరావు ఈ మూవీని నిర్మించారు. రోహిత్ వర్ధన్ సంగీతం అందించారు. అనుకున్న రేంజ్ సక్సెస్ మాత్రం ఆయనకు దక్కకపోవడంతో ఆయన తిరిగి సినిమాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…