Kodali Nani : గత ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈ సారి కూడా అదే జోరు కొనసాగించాలని అనుకుంటుంది. కొద్దిరోజులుగా నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్న అధిష్టానం గుడివాడ సీటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి పోటీ చేయడం ఖాయమని వైఎస్సార్సీపీ కేడర్ ధీమాతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గుడివాడలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో తెరపైకి కొత్త పేరు వచ్చింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ లో ఎదురు లేదు. సీఎం జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయనకు టిక్కెట్ ఖరారుచేయలేదు. అలాగని వేరే అభ్యర్థి పేరు బయటకు రాలేదు.
కానీ ఇప్పుడు కొత్తగా వేరే అభ్యర్థి పేరు వినపిస్తోంది. మండలి హనుమంతరావు అనే నేతకు గుడివాడ టిక్కెట్ ఇవ్వబోతన్నారన్న ప్రచారం జరుగుతోంది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసీపీ నేతల గుసగుసలాడుకుంటున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
గుడివాడ వైసీపీలో గందరగోళం నెలకొనడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు సంచలనంగా మారడంతో మండలి హనుమంతరావు పేరుతో ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. గుడివాడ ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు వెలిసిన గంటలోపే వాటిని తొలగించారు. కొడాలి నాని ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని మండల హనుమంతరావు వర్గీయులు ఆరోపిస్తున్నారు.. ఇప్పుడు సీఎం జగన్ నిజంగా అభ్యర్థిని మార్చే పరిస్థితి లేదని వైసీపీ వర్గాలనుకుంటున్నాయి. అయితే గుడివాడలో సర్వే రిపోర్టులు చూసి .. కాపు సామాజికవర్గ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన జగన్ చేయవచ్చని చెబుతున్నారు. మరో కీలక నియోజకవర్గానికి కొడాలి నానిని పంవవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మండలి హనుంతరావు గుడివాడ వైసీపీలో కలకలం రేపుతున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…