Kamakshi Bhaskarla : ప్రస్తుతం టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. మా ఊరి పొలిమేర మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ చిత్రం మూఢనమ్మకాలు, చేతబడులు, అనుమాస్పద మరణాల చుట్టూ తిరిగే ఈ మిస్టికల్ థ్రిల్లర్ గా రూపొందింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా మా ఊరి పొలిమేర 2 రాబోతోంది. రీసెంట్గా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఊరి పొలిమేర గుడిలోని మిస్టరీ, చేతబడులు అనే కాన్సెప్ట్ పైనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. మహబూబ్నగర్ లో దారుణం.. అసలు చేతబడులు నిజంగా ఉన్నాయా అనే టీవీ న్యూస్ ఛానెల్ వార్తలతో ట్రైలర్ మొదలవుతుంది.
ఈ సీక్వెల్ ని మాత్రం థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. నవంబర్ 3న మా ఊరి పొలిమేర 2 మూవీ రిలీజ్ కానుంది. తొలి పార్ట్ ను మంచి సస్పెన్స్ తో ముగించిన మేకర్స్.. సీక్వెల్లో మాత్రం సైన్స్, మూఢనమ్మకం మధ్య జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తొలి పార్ట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజైంది. తొలి పార్ట్లో నటించిన సత్యమ్ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శీను, రవి వర్మలే ఈ సీక్వెల్లోనూ ముఖ్యమైన పాత్రలు పోషించారు. మహబూబ్నగర్ లో జరిగిన దారుణ హత్యలకు, చేతబడులకు మధ్య ఉన్న లింకేంటి అనేది తెలుసుకోవడానికి ఓ పోలీస్ అధికారి బయలుదేరతాడు. అతని వెంటే ఓ ఆర్కియాలజిస్ట్ కూడా వెళ్తాడు.
ఆ గ్రామంలోని ఆలయ మిస్టరీని ఛేదించడమే లక్ష్యంగా వీళ్లు పని చేస్తుంటారు. మంచి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ ను ఆసక్తికరంగా మార్చేశాయి. మా ఊరి పొలిమేర మూవీతో పోలిస్తే.. ఈ సీక్వెల్ ను కాస్త భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, మీనాక్షి మాట్లాడుతూ మిరపకాయ తీసినప్పుడు ప్లస్ 2 చదువుతున్నాను అని పేర్కొంది. అంటే హరీష్ శంకర్ ఏజ్ చాలా ఎక్కువ అన్నట్టు ఆమె మాట్లాడేసరికి అందరు ఆశ్చర్యపోయారు. మిరపకాయ సినిమా తనకెంతో నచ్చినట్టు అమ్మడు పేర్కొంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…