KA Paul : ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కూడా తెగ సందడి చేస్తూ ఉండే కేఏ పాల్ ఈ సారి ఏపీ అసెంబ్లీ, లోక్ సభలలో ఎన్నికలలో కూడా హంగామా చేయనున్నాడు. ఈ ఎన్నికల్లో కేఏ పాల్కు ప్రజాశాంతి పార్టీకి కొత్త గుర్తు వచ్చింది. ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కొత్త గుర్తును కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయించిందని కేఏ పాల్ తెలిపారు. మాకు కుటుంబ పాలన వద్దు, కుండ పాలన కావాలని అన్నారు. కుంట గుర్తును తమకు కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి పాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ, తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ ఉమ్మడి గుర్తుతో పోటీ చేస్తుందన్నారు.
కుటుంబ పాలన మనకు వద్దని కుండ పాలన కావాలని అభిప్రాయపడ్డారు. కుండ గుర్తును తమకు కేటాయించినందుకు ఎన్నికల కమిషన్ కు కేఏ పాల్ దన్యవాదాలు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లో కామన్ సింబల్ తో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. శాంతి పాలన రావాలంటే కుండ పాలన రావాలని తెలిపారు. మండుతున్న ఎండలకు డాక్టర్లు ,సైంటిస్టులు ఫ్రిజ్ లోని నీళ్లు తాగొద్దని చెబుతున్నారని అందుకే మంచి జరగాలన్న మంచి చేయాలన్న కుండ పాలన రావాలని అన్నారు. గతంలో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ కుండ గుర్తును కేటాయిచింది ఈసీ.
లోక్సభ ఎన్నికలు-2024లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావడం కొంత మందికి ఇష్టం లేదని అన్నారు. ‘‘ నేను సీఎం అయితే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరిపోతుంది. ప్రజలను బానిసలుగా ఉంచాలని పాలకులు చూస్తున్నారు. 7 ప్రధాన అంశాలతో ఎన్నికల్లోకి వెళ్తాం. మంచి పాలన కోసం ప్రజాశాంతి పార్టీకి పట్టం కట్టండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి విశాఖను రాజధానిగా చేస్తాను. ఐదేళ్లలో విశాఖను వాషింగ్టన్ డీసీకి ధీటుగా అభివృద్ధి చేసి చూపిస్తా. విశాఖకు లక్ష కోట్లు ఆదాయం తెస్తా. విశాఖ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చేస్’’ అని కేఏ పాల్ అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…