KA Paul : జనసేనాని పవన్ కళ్యాణ్పై పలు పార్టీల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండగా, అతనిపై మిగతా పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేఏ పాల్ .. పవన్ పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ బడుగు బలహీనవర్గాల కోసం పార్టీ పెట్టాను అన్నాడు.. కానీ మళ్ళీ అగ్ర కులాల కోసం పని చేస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన సలహాలు తీసుకుంటున్నాడు కానీ పూర్తి స్థాయి లో అమలు చేయటం లేదని తెలిపారు పాల్. పవన్ కళ్యాణ్.. ఆయనే సీఎం అని అంటున్నాడు.. టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.
గతంలో కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పవన్ ఇప్పుడు పొత్తులు వద్దని బయటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పొత్తులు ఎందుకని పవన్ ను ప్రశ్నించారు. పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడని తెలిపారు. “నేనే సనాతన ధర్మం, చేగువేరా, నక్సలైట్, ఆర్ఎస్ఎస్ ఇలా పూటకో ధర్మం అంటున్నాడు.. అసలు నువ్వు ఏ ధర్మంను పాటిస్తున్నావు” నాకు చెప్పు అని కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ స్టార్ అని ఎద్దేవా చేశారు.
“వంగవీటి రంగాను చంపిన వారితో నీకు పొత్తులు ఎందుకు” అని ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఒక్కసారి తప్పు చేస్తే.. పవన్ కళ్యాణ్ రోజూ తప్పు చేస్తున్నాడని విమర్శించారు. నా రియల్ హీరో మీరే అని నన్ను అన్న పవన్ కళ్యాణ్.. నా బాటలో ఎందుకు నడవడం లేదు” అని ప్రశ్నించారు. ఆయనకు తిప్పి కొడితే పది లక్షల మంది అభిమానులు కూడా లేరని కేఏ పాల్ కామెంట్స్ చేశారు. ప్రజలను మోసం చేస్తూ పవన్ ఏడాదికి 10 పార్టీలు మారాడని ఆరోపించారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఏపీలో ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే.. తాను కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని పాల్ పేర్కొన్నారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…