Jr NTR : ఇటీవల ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోలు కూడా మల్టీ స్టారర్స్పై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. అయితే ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్న సినిమా రానున్న రోజులలో వరుస మల్టీ స్టారర్స్ చేయడానికి తెగ ఆసక్తి చూపుతన్నాడు.
ఎన్టీఆర్ త్వరలో హిందీ లో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తైన తర్వత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇక ఈ సినిమా పూర్తైన తర్వత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఒక మల్టీస్టార్ర్ర్ మూవీ చెయ్యబోతున్నట్టు బాలీవుడ్ మొత్తం ఇప్పుడు కోడై కూస్తుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య థార్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ని పౌరాణిక నేపథ్యం లో ‘ది ఇమ్మోర్తల్స్ ఆఫ్ అశ్వద్దామా’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే ఇద్దరు హీరోలకు కలిసి స్టోరీ లైన్ వినిపించగా, ఇద్దరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.
పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రమ్మని డైరెక్టర్ కి చెప్పడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడడం గ్యారెంటీ అని కొందరు భావిస్తున్నారు. టాలెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ లో బద్దలు అవుతుందో అని అందరు అంచనాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, బన్నీ పోటా పోటీగా డ్యాన్స్ లు చేస్తారు కాబట్టి వారిద్దరు కలిసి బాక్సాఫీస్ని షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి ‘పుష్ప : ది రూల్’ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…