Jayavani : ఇటీవల కొందరు మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. యమదొంగ, మర్యాద రామన్న, విక్రమార్కుడు, గుంటూర్ టాకీస్ వంటి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జయవాణి తనని ఓ దర్శకుడు మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కెరీర్లో ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొస్తూ.. తనకు విలన్ పాత్రలు సినిమాల్లో ఎక్కువగా వచ్చాయని జయవాణి తెలిపారు. ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని జయవాణి వెల్లడించారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నల్లగా ఉన్నావని చాలా మంది అవమానించారని చెప్పారు.
నటిగా సెట్ కానని అన్నారని.. కానీ తాను మాత్రం ఎలాగైనా ఇండస్ట్రీలోనే కొనసాగాలని చాలా కష్టపడ్డానని అన్నారు. ఇక ఓ డైరెక్టర్ అయితే సినిమా ఛాన్స్ ఇస్తానని పిలిచి ఫొటో షూట్ చేశాడట. అనంతరం దర్శకుడి నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదని కానీ ఆ ఫోటో షూట్కి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలిపింది. వెబ్సైట్లో ఆ ఫోటోలు పెట్టిన వ్యక్తి కూడా ఎవరో తెలియదని పేర్కొంది. అయితే అవి తన కెరీర్ కే మచ్చగా మిగిలాయని వాపోయింది జయవాణి.
అవకాశాల కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించా. చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేసేదాన్ని. వచ్చిన పాత్రకు నేను వంద శాతం న్యాయం చేశా. తమిళ సినిమాల్లో నటించేందుకు ఛాన్స్ ఉందని పిలిస్తే అక్కడి వెళ్లాను. మొదట్లో మదర్ క్యారెక్టర్ ఉందని స్క్రీన్ టెస్ట్ చేశారు. కానీ ఆ తరువాత తల్లి పాత్ర వద్దని వేరే క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్లు వస్తున్నా చేయట్లేదు అంటూ స్పష్టం చేసింది జయవాణి. విజయవాడలో జన్మించిన జయవాణి బీఏ వరకు చదివింది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి ఉండడంతో ఈ రంగంలోకి అడుగుపెట్టింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…