IND Vs NZ 2022 : వరల్డ్ కప్లో చెత్త ప్రదర్శన కనబరచిన ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ పై గెలిచి తమ సత్తా చాటాలని అనుకుంటుంది. అయితే టీ20ల నుంచి సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి.. వన్డేలపై ఎక్కువ ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేస్తోంది. అయితే న్యూజిలాండ్ టూర్కు కొంతమంది సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది. కివీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు టీమ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ టూర్ కోసం భారత ఆటగాళ్లు న్యూజిలాండ్ చేరుకున్నారు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 టీమ్ బాధ్యతలు చేపట్టాడు.
రోహిత్ శర్మతోపాటు, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి ఈ టోర్నీకి విశ్రాంతినిచ్చింది. దీంతో వన్డే టోర్నీకి శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించబోతుండగా, టీ20లకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్గా ఉండబోతున్నారు. రెండు సిరీస్లకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా కొనసాగుతాడు. అయితే ఈ సారి న్యూజిలాండ్ ఇండియా సిరీస్ స్ట్రీమింగ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీని ద్వారా క్రికెట్ అభిమానులని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు దృష్టి మరల్చేలా చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రకటనలతో ఈ సిరీస్పై ఆసక్తి కనబరిచే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఓ యాడ్ వైరల్ అవుతుండగా, ఇది కాస్త వెరైటీగా ఉంది. భారతదేశానికి చెందిన మహిళ న్యూజిలాండ్కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అయితే భారత్.. న్యూజిలాండ్తో మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా బెడ్ రూమ్ నుండి బయటకు నెట్టేస్తుంది. 2019లో ప్రపంచకప్ సెమీస్లో భారత్ చేతిలో ఓడిపోయింది, ఆపై 2021లో, మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించింది. ఈ క్రమంలో ప్రకటనలో మహిళ మాట్లాడుతూ…, “కుచ్ బద్లేగా క్యా?” అని అడుగుతుంది. (ఏదైనా మారుతుందా?). అంటే మహిళ తన భర్తను పడకగది నుండి బయటకు పంపకూడదంటే భారత్ గెలవాలని కోరుకుంటున్నట్లుగా ప్రకటన కాస్త సృజనాత్మకంగా ఉంది కాని ఇది కొంత భారత టీంని కించపరిసేలా ఉన్నట్టుగా ఉందని అనిపిస్తుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…