IND Vs AUS : ప్రస్తుతం టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రెండు టెస్టుల్లో ఘనవిజయం సాధించిన టీమిండియా ఫుల్ జోష్ మీద ఉంది. ఎట్టకేలకు సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో మూడో టెస్టులో బరిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని కూడా అనుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టీమిండియా జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాపార్డర్.. కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకి ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం ఉండగా వారు దాన్ని సునాయాసంగానే ఛేదించారు. అయితే ఈ మ్యాచ్లో ఘోర పరాజయంతో అందరూ రోహిత్ శర్మను నిందిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ చేసిన ఒకే ఒక్క తప్పు వలన ఇండియన్ టీంకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు ముఖ్యంగా ఆలోచించేది పిచ్ గురించి, అనంతరం టాస్ గురించి. ఇక జట్టు కెప్టెన్ కు పిచ్ గురించి పూర్తి అవగాహన ఉంటే బ్యాటింగ్ తీసుకోవాలో లేదా బౌలింగ్ తీసుకోవాలో అని ముందే నిర్ణయం తీసుకుంటారు. అయితే గత రెండు టెస్ట్లలో ఆసీస్ చేసిన తప్పును ఇప్పుడు రోహిత్ చేశాడు.
మొదటి రెండు టెస్ట్లలో ఆసీస్ ముందు బ్యాటింగ్ చేయడం వలనే ఓడిపోయిందని, వాటిని చూసిన తర్వాత కూడా రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఏంటని అభిమానులు, క్రికెట్ మాజీలు ప్రశ్నిస్తున్నారు. అదే రోహిత్ బౌలింగ్ తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెబుతున్నారు. అయితే ఆసీస్ బౌలర్స్ చూపించిన ప్రతిభను మన బౌలర్స్ పెద్దగా చూపించ లేదు. అలాగే టాస్ గెలిచి బౌలింగ్కు బదులుగా ముందు బ్యాటింగ్ తీసుకోవడం, నిర్లక్ష్యపు షాట్స్ ఆడడం.. వంటివన్నీ టీమిండియా ఓటమికి కారణమయ్యాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేకున్నా.. మార్చి 9 నుంచి ప్రారంభం అయ్యే చివరి టెస్టులో మాత్రం భారత్ నెగ్గాల్సిందే. కనీసం డ్రా అయినా చేసుకోవాలి. లేదంటే అటు టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కి చేరుకునే అవకాశాలు సన్నగిల్లుతాయి. మరి 4వ టెస్టులో గెలుస్తారా.. లేదా.. అన్నది చూడాలి.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…