Viral Photo : సోషల్ మీడియా వలన సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన పాత విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. చిన్ననాటి ఫొటోలతోపాటు వారి ఫ్యామిలీ విషయాలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న కార్తీ, సూర్యల చిన్ననాటి పిక్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. హీరో సూర్య సినీ పరిశ్రమలోకి అఢుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అన్నతో చిన్నప్పుడు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ భావోద్వేగం, అభిమానంతో కూడిన తన ఫీలింగ్స్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు హీరో కార్తీ.
ఆ పిక్తో పాటు ట్వీట్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.1997లో నెరుక్కు నెర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు నటుడు సూర్య. ఆ తర్వాత హీరోగా సుమారు 40కి సినిమాల్లో యాక్ట్ చేశారు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్, మరికొన్ని సినిమాలను నిర్మించి నిర్మాతగా మారారు. అయితే తన అన్నయ్య ప్రతికూలాంశాలను పాజిటివ్గా మార్చుకునేందుకు పగలు రాత్రి శ్రమించి.. విజయాలతో పోటీపడి అనుకున్నది తన అన్నయ్య సాధిస్తూనే ఉన్నాడని తెలిపారు కార్తీ. ప్రతి క్షణం తన లక్ష్యంపైనే దృష్టి సారిస్తూ.. ఎప్పుడూ తన ఉదార స్వభావాన్ని చూపుతూ.. వేల మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి నా అన్నయ్య అంటూ కార్తీ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.
తన అన్నయ్యపై కార్తీ చూపించిన ప్రేమకు నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు నటనలో ఎవరూ తక్కువ కాదన్నట్లుగా దూసుకుపోతున్నారు. రీసెంట్గా కార్తీని హీరోగా పెట్టి సూర్య వీరుమాన్ అనే సినిమాని నిర్మించారు. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ కొట్టింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. ఇక సూర్య విషయానికి వస్తే మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు సూర్య. సూర్య తన నెక్ట్ మూవీ బాలా దర్శకత్వంలో తీస్తున్నారు. ఈ సినిమా సూర్యకి 41వ చిత్రంగా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్యతో పాటు కృతి శెట్టి, మమితా బైజు కూడా నటించనున్నారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…