RRR Movie : బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా, ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తాను చాటుతుంది. అయితే బాహుబలికి మాదిరిగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుందని అందరు భావించారు. కాని రాజమౌళి ఎక్కడ స్పందించకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలోనే ఉండిపోయారు. అయితే తాజాగా సీక్వెల్పై నోరు విప్పారు రాజమౌళి.
ప్రస్తుతం యూఎస్ఏలోని చికాగోలో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్స్ జరుగుతోంది. విదేశీయుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ అందుతున్న నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ వస్తే బాగుటుందని.. సినీ ప్రియులు, అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో జక్కన్న కూడా ట్రిపుల్ ఆర్ సీక్వెల్ పైన స్పందించారు. ప్రస్తుతం తన తండ్రితో కలిసి సీక్వెల్పై ప్రాథమిక కథా చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడే ఏం విషయాలు రివీల్ చేయదలుచుకోలేదు అని మెగా, నందమూరి అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పాడు.
ఆర్ఆర్ఆర్ లో ఉద్యమ వీరులు కొమురం భీం, సీతారామరాజుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు. ఇక దీనికి సీక్వెల్ కూడా రాబోతుందని, అందుకు సంబంధించిన చిన్న అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రాజమౌళి లిస్టులో నెక్ట్స్ చిత్రం మహేశ్ బాబుతో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. మూవీకి దాదాపు రెండేళ్లు పైనే పడుతుంది. మరి ఈ మూవీ పూర్తయ్యాక జక్కన్న ట్రిపుల్ ఆర్ సీక్వెల్ ఏమైన మొదలు పెడతాడా అన్నది చూడాలి. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రం 1920 బ్యాక్డ్రాప్లో జరిగిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. నిజమైన స్వాంత్య్ర పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ మధ్య స్నేహం, వైరం ఉంటే ఎలా ఉంటుంది అనే కల్పిత కథాంశంతో తెరకెక్కింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…