Godfather Event : ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. లూసిఫర్ రీమేక్గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు ఘోస్ట్, స్వాతి ముత్యం విడుదల కానున్న నేపథ్యంలో గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటీవల అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ వేడుకకి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఇక ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. నేను ఈ సినిమా చేయడానికి ప్రధానమైన కారణం చరణ్. నా ఇమేజ్ కి తగిన కథ అంటూ నన్ను ఒప్పించాడు. దర్శకుడిగా మోహన్ రాజా అయితే బాగుంటాడని తనే సూచించాడు అని చెప్పారు.
భారీ వర్షం పడుతున్నా కూడా అభిమానులు ఎంతో ఓపికగా చిరు స్పీచ్ విన్నారు. ఇది చూసి కూడా చిరు మురిసిపోయారు. అయితే ఈవెంట్లో జేబు దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే 300కి పైగా సెల్ ఫోన్స్ దొంగిలించినట్టు తెలుస్తుంది. ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్ బాట్ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 270 మందికి పైగా తమ సెల్ ఫోన్స్ అపహరణకి గురైనట్టు చాట్బాట్ కి ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్కి 20, టూటౌన్ పోలీస్ స్టేషన్కి 18 రాతపూర్వక ఫిర్యాదులు అందినట్టు తెలుస్తుంది.
గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇక గాడ్ ఫాదర్ ట్రైలర్ విషయానికి వస్తే.. లూసిఫర్ ఇచ్చే కొత్త అనుభూతిని గాడ్ ఫాదర్ ఇవ్వలేకపోయింది. దానికి చాలా కారణాలు వున్నాయి. మోహన్ లాల్ ఆహార్యం, కేరళలోని అందమైన కొత్త లోకేషన్లు, వివేక్ ఓబరాయ్ ఇలా చాలా ప్లస్ లు వున్నాయి . కానీ గాడ్ ఫాదర్ దగ్గరకు వచ్చేసరికి మన ప్రేక్షకులకు అలవాటైన భారీ యాక్షన్ సినిమా చూసిన రెగ్యులర్ ఫీల్ నే కలిగింది. మరి ఇది తెలుగు ప్రేక్షకులని అలరిస్తుందా లేదా అనేది చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…