Deepika Padukone : ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మూవీ రిలీజై వారం అవుతున్నా కూడా ఆదరణ బాగానే ఉంది.అయితే ఈ సినిమా గురించి బయటకు వస్తున్న రోజుకో వార్త కల్కిపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కల్కిలో దీపికా పదుకొనే పోషించిన సుమతీ పాత్రకు మరో స్టార్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పిందని ప్రచారం నడుస్తుంది.సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా కనిపించింది. కల్కి పాత్రకి జన్మనివ్వబోయేది ఆమె. ఆమెను పట్టుకోవడానికి భైరవ పాత్రలో.. ప్రభాస్ ఆమె వెంట పడుతూ ఉంటాడు. అశ్వత్థామ పాత్రులో అమితాబ్ బచ్చన్.. ఆమె పాత్రను కాపాడుతూ ఉంటాడు.
ఈ సినిమాలో చాలా మంది ముఖ్య పాత్రలలో కనిపించి సందడి చేయగా, కొందరు వాయిస్ ఓవర్ అందించారు. బుజ్జి పాత్రకి కీర్తి సురేష్ వాయిస్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో శోభిత ధూళిపాల కూడా ఒక చిన్న భాగమే అని తెలుసా? శోభిత ఈ సినిమాలో కనిపించదు కానీ ఆమె గొంతు మాత్రం మనకి వినిపిస్తుంది. ఈ సినిమాలో దీపికా పడుకొనే పోషించిన సుమతి పాత్రకి డబ్బింగ్ చెప్పింది.. మరెవరో కాదు.. శోభిత ధూళిపాళ. తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత.. గూడచారి , మేజర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. అయితే కల్కి చిత్రంతో దీపికా పదుకొణే తెలుగులోకి పరిచయం కాగా, ఒరిజినల్ కంటే ముందు దీపిక కల్కి సినిమాకు తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది. ట్రైలర్లోనూ కూడా ఆమె గొంతు వినిపించింది.
అయితే దీపికా డబ్బింగ్పై దారుణంగా నెగెటివిటీ రావడంతో, ఆమె పాత్రకు శోభిత డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా శోభిత మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.సుమతి పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు థాంక్స్ చెబుతూ థియేటర్లలో శోభితకు క్రెడిట్స్ ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ ని శోభిత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ స్వీటెస్ట్ అని రాసుకొచ్చింది శోభిత. దీంతో ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఆ ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక శోభిత.. నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుందనే వార్తలతో ఇటీవల వార్తలలో నిలిచింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…