Prabhas : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అత్యంత సుందరంగా నిర్మించిన రామమందిరాన్ని.. ఈ నెల 22న ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. జనవరి 22న జరిగే కార్యక్రమం కోసం దేశ, విదేశాల్లోని 7వేల మందికి ఆహ్వానాలు పంపినట్టు సమాచారం. ఇందులోని 6వేల ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అథిథులకు చేరుకున్నట్టు సమాచారం. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రిక అందుకున్న వారిలో ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్ కూడా ఉన్నారు. రాజకీయ నేతల నుంచి సెలబ్రిటీల వరకు.. ఆహ్వానం అందుకున్న వారిలో మన తెలుగు ఇండస్ట్రీ నుండి ఇద్దరు హీరోలు ఉండడం విశేషం.
టాలీవుడ్ లో చిరంజీవికి ప్రత్యేక స్థానం. ప్రభాస్ ఫ్యామిలీ మొదట్నుంచి బీజేపీ పార్టీలోనే ఉంది. అదిపురుష్ సినిమా చేసిన ప్రభాస్ కు రాముడి ఆలయం ప్రారంభోత్సవ వేళ ఆహ్వానించాలని నిర్ణయించారు. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, నితిన్, నిఖిల్ తోనూ బీజేపీ నేతలు సన్నిహితంగా ఉంటున్నారు. అదే విధంగా రాజకీయంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. వీరి ఆహ్వానం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తమిళం నుంచి సూపర్ స్టార్ రజనీ, ధనుష్లకు ఆహ్వానం అందింది. కన్నడ నుంచి కేజీఎఫ్ స్టార్ యష్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిలకు ఆహ్వానం అందిందట. మరోవైపు మలయాళం నంచి మోహన్లాల్ను ఆహ్వానించారు.
అయితే ప్రభాస్కి ఆహ్వానం అందడం ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ప్రభాస్పై ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకి ఉన్న బిజీ షెడ్యూల్లో ప్రబాస్ ఖాళీ చేసుకొని మరీ అక్కడికి వెళ్లనుండడం గొప్ప విషయం అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ గురించి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది అని చెప్పాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…