CM Revanth Reddy : ఎవరు ఊహించని విధంగా ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన కాన్వాయ్లో కార్ల కలర్ను తెలుపు నుంచి బ్లాక్ కలర్ లోకి మార్చాలని ఆదేశించారు. భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహిత వర్గాలు చెబుతుననాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఈ సూచన చేసిందని అంటున్నారు. సాధారణంగా సీఎం కాన్వాయ్లోని కార్లన్నింటికీ ఒకే కలర్ ఉంటుంది. నంబర్ ప్లేట్లు కూడా ఒకే రకం ఉంటాయి. కానీ కార్ల ఆర్డర్ మాత్రం తరచూ మార్చేస్తారు. తద్వారా సీఎం ఏ కారులో ఉన్నదీ దుండగులకు తెలియదు. ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్ల నంబర్ ప్లేట్పై 0009 అనే నంబర్ ఉంది. అధికారులు సీఎం కారుకు TS 07 FF 0009 నంబర్ కేటాయించారు. కాన్వాయ్ లోని మిగతా కార్లకు మాత్రం TS 09 RR 0009 అనే నంబర్ ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో ఆయన 4 కలర్స్ ఉన్న ల్యాండ్ క్రూయిజర్ కారులో వెళ్తున్నారు. మిగతా కార్లకు సిల్వర్, వైట్ కలర్స్ ఉన్నాయి. దాంతో దుండగులకు ఆయన ఏ కారులో ఉన్నారో క్లియర్గా తెలిసిపోతోంది. ఇది సెక్యూరిటీ సమస్యలు తెచ్చేలా కనిపిస్తోంది. అందుకే సెక్యూరిటీ వింగ్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని అన్ని కార్లకూ నలుపు రంగు వేసినట్టు తెలుస్తుంది. రేవంత్కి బ్లాక్ కలర్ అంటే ఇష్టం. అందువల్ల అన్ని కార్లకూ అదే కలర్ వేసేయమని ఆయన ఆదేశించారు. ఇందులో సెంటిమెంటూ, వాస్తు వంటివేవీ లేవు. తాను ప్రయాణిస్తున్న కారు ప్రధానంగా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి.. మిగతా కార్లకు కూడా అదే కలర్ ఫిక్స్ చేశారు.
ఇక ప్రోటోకాల్ ప్రకారం.. సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే.. కనీసం 5 నిమిషాల ముందు ఆ దారిలో ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో అక్కడక్కడా కానిస్టేబుళ్లను ముందుగానే నియమిస్తారు. ఇతర లింకు రోడ్ల నుంచి సీఎం వెళ్లే మార్గంలోకి ట్రాఫిక్ రాకుండా చూసుకోవడం వారి బాధ్యత. కాని రేవంత్ తన కాన్వాయ్ వలన ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్న సమయంలో అంబులెన్స్ రావడంతో రేవంత్ ఆయన కాన్వాయ్కి సైడ్ ఇచ్చి అంబులెన్స్ని పక్క దారికి మళ్లించడంతో అందరు రేవంత్పై ప్రశంసలు కురిపించడం మనం చూశాం.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…