Crispy Fish Fry : చేప ముక్క‌ల‌ను క్రిస్పీగా ఇలా ఫ్రై చేయాలి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Crispy Fish Fry : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేసుకుంటుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల‌కు అధిక ప్రాధాన్య‌తను ఇస్తుంటారు. అయితే సీజ‌న్ల‌ను బ‌ట్టి కూడా నాన్ వెజ్ ప్రియులు తాము తినే ఆహారాల‌ను మారుస్తుంటారు. అందులో భాగంగానే ప్ర‌స్తుతం మృగ‌శిర కార్తె సీజ‌న్ న‌డుస్తుంది క‌నుక చేప‌ల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. అయితే చేప‌ల‌ను అంద‌రూ తిన‌లేరు. ముళ్లు ఉంటాయ‌ని భ‌య‌ప‌డ‌తారు. కానీ చేప‌ల‌ను ఇలా క్రిస్పీగా ఫ్రై చేస్తే.. ఇష్టం లేని వారు సైతం రెండు ముక్క‌ల‌ను ఎక్కువ‌గానే తింటారు. ఈ ఫ్రై ని చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ చేప‌ల ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు – 4 లేదా 6, కార్న్ ఫ్లోర్ – 1 క‌ప్పు, కాశ్మీరీ కారం – 1 టీస్పూన్‌, వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్‌, ఉల్లిపాయ ముద్ద – 1 టేబుల్ స్పూన్‌, ప‌చ్చి మిర్చి ముద్ద – అర టేబుల్ స్పూన్ (కారం కావాల‌నుకుంటే ఇంకా వేసుకోవ‌చ్చు), మిరియాల పొడి – 1 టీస్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, కారం – 1 టీస్పూన్‌, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, పచ్చి మిర్చి – 2 (స‌న్న‌గా, నిలువుగా త‌ర‌గాలి), నిమ్మ‌ర‌సం – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – 1 టీస్పూన్‌.

Crispy Fish Fry recipe how to make it
Crispy Fish Fry

క్రిస్పీ చేప‌ల ఫ్రై త‌యారు చేసే విధానం..

ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్‌, కాశ్మీరీ కారం, వెల్లుల్లి ముద్ద‌, ఉల్లిపాయ ముద్ద‌, ప‌చ్చి మిర్చి ముద్ద‌, మిరియాల పొడి, ఉప్పు, కారం, నిమ్మ‌ర‌సం, జీల‌క‌ర్ర పొడి వేసి బాగా క‌ల‌పాలి. దీన్ని మెత్త‌ని మ‌సాలా పేస్ట్‌లా చేయాలి. దీన్ని చేప ముక్క‌ల‌కు రెండు వైపులా బాగా ప‌ట్టించాలి. త‌రువాత చేప ముక్క‌ల‌ను 2 నుంచి 3 గంట‌ల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో ముక్క‌ల‌కు మ‌సాలా బాగా ప‌ట్టి చ‌క్క‌గా మ్యారినేట్ అవుతాయి. త‌రువాత ఒక పాన్ తీసుకుని అందులో చేప ముక్క‌లు మునిగేలా నూనె పోయాలి. నూనె కాగిన త‌రువాత చేప ముక్క‌ల‌ను అందులో వేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకోవాలి.

అనంత‌రం ముక్క‌ల‌ను బ‌య‌ట‌కు తీయాలి. త‌రువాత క‌రివేపాకు రెమ్మ‌, చీల్చిన ప‌చ్చి మిర్చి ముక్క‌ల‌ను వేసి అదే నూనెలో వేయించాలి. అనంత‌రం వాటిని అంత‌కు ముందు ఫ్రై చేసిన చేప ముక్క‌ల‌పై వేసి గార్నిష్ చేయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన క్రిస్పీ చేప‌ల ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని నేరుగా తిన‌వ‌చ్చు. లేదా ప‌ప్పు, సాంబార్ వంటి ఇత‌ర ఆహారాల‌తో నంజుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేప ముక్క‌ల‌ను ఫ్రై చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
editor

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago