CM Revanth Reddy : కుమారి ఆంటి.. ఇటీవలి కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపించే పేరు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి ఈ పేరు చాలా సుపరిచితం. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్ ఛానెల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాడు. దీంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. కేవలం హైదరాబాద్ వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చూసేందుకు పరుగులు పెట్టారు. సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపడమే కాదు, ఆమెతో తమ సినిమాలు ప్రమోషన్స్ కూడా చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వాటిల్లింది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి.. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చిచెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు. దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. పోలీసుల చర్యతో కుమారి ఆంటీకి అన్యాయం జరిగిందని.. ఆమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చిరు వ్యాపారిపై ఇలాంటి చర్యలకు దిగటం సరైంది కాదని కామెంట్లు పెడుతున్నారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమెకు బాసటగా నిలిచారు.
కుమారి ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి తీసేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆమె ఫుడ్ స్టాల్ను మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు. కుమారిపై పెట్టిన కేసు విషయాన్ని కూడా పునఃపరిశీలన చేయాలని డీజీపీని ఆదేశించారు. మెున్నటి వరకు కుమారి ఎక్కడైతే స్టాల్ పెట్టుకుందో ఆ స్థానంలోనే వ్యాపారం చేసుకునేదుకు అవకాశం ఇవ్వాలని ఎంఏయూడగీ అధికారులను కూడా ఆదేశించారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సీఏం.. త్వరలోనే ఆమె స్టాల్ను సందర్శిస్తానని చెప్పారు. ఈ మేరకు సీఎంవో నుంచి ప్రభుత్వ సీపీఆర్వో అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న చోటి నుంచే కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని కొనసాగించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…