CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్నారు. మరోవైపు తమపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై విరుకుపడుతూ హాట్ టాపిక్గా మారుతున్నారు. సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ భాష తీరుగా సరిగ్గా లేదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను వెంట్రుక కూడా పీకలేరంటూ కేసీఆర్ అంటున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లేకుండా లాగేయగలరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటామని కేసీఆర్ అనుకుంటున్నారని.. తాను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డినంటూ రేవంత్ రెడ్డిని అంటూ గుర్తు చేశారు.
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అంగీలాగు ఊడదీసి.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలో.. బిడ్డా అల్లుడు వస్తే ఎక్కడా పండబెట్టాలంటూ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని తెలంగాణ ప్రజలకు కట్టివ్వలేదని.. కానీ కేసీఆర్కు మాత్రం బిడ్డ, అల్లుడు కొడుకు అందరికి కలిసి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి.. తెలంగాణను దోపిడీ దొంగలుగా, అడవి పందుల్లా అడ్డగోలుగా దోచుకున్నారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ లలో నేను పండుకోలేదు కేటీఆర్ అంటూ ఆయనకి తనదైన శైలిలో పంచ్లు వేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ పడుకున్నానో నేను అక్కడే ఉంటున్నా అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఓడించామని.. ఇప్పుడు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కూడా అదే ఉత్సాహంతో ఓడించాలంటూ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి ఏం చేసిందంటూ ప్రశ్నించారు. మతం పేరిట చిచ్చుపెట్టి మూడోసారి అధికారం చేపట్టాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…