CM KCR : హ్యాట్రిక్ టార్గెట్గా భారత రాష్ట్ర సమితి ప్రచారపర్వంలో కేసీఆర్ దూసుకెళ్తోంది. పక్కా వ్యూహాలతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాటాల తూటాలు పెలుస్తూ.. విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఇల్లందు ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరునూరైనా బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఆగం ఆగం కావొద్దు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అభివృద్ది మంత్రంగా మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ కేసీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సత్తుపల్లి సభలో ఏపీ పరిస్థితులను ప్రస్తావించారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అన్నారు. సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. విడిపోతే రాష్ట్రంలో కరెంటు ఉండదని.. నష్టపోతామంటూ శాపాలు పెట్టారని.. ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనన్న కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. అహంకారంతో సవాళ్లు చేసేవాళ్లను ఓడించాలన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించి.. ఓటెయ్యాలంటూ కేసీఆర్ ప్రజలకు సూచించారు.
ఖమ్మం జిల్లా బంగారు తునక అవుతుందంటూ కేసీఆర్ తెలియజేస్తూ… కొందరు ఏవేవో మాట్లాడుతున్నారని.. వందకు వంద శాతం దళిత బంధును కొనసాగిస్తామని.. చిల్లరగాళ్ల మాటలు పట్టించుకోవద్దంటూ కేసీఆర్ పేర్కొన్నారు. సత్తుపల్లి, ఇల్లందు అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.అభివృద్ది-సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. బీసీ బంధు పై కాంగ్రెసోళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు కేసీఆర్. కాంగ్రెసోళ్ల మాటల నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు గొల్లుమంటున్నారంటూ పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ చూడమన్న కాంగ్రెస్ నేతల సవాల్పై స్పందించిన కేసీఆర్.. వారివి అమలుకాని హామీలంటూ ఫైర్ అయ్యారు. ఆదివాసీలకు అన్ని విధాల అండగా వుండేది బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. సింగిల్ రోడ్ అంటే ఆంధ్రా అని, డబుల్ రోడ్ అంటే తెలంగాణ అని గుర్తు చేసుకోవాలని గుర్తుంచుకోవాలంటూ కేసీఆర్ గుర్తు చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…