CM KCR : తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు కాస్త నిరాశలో ఉన్నారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను గెలుచుకోగా, అధికార బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు ఓటర్లు. బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక అధికారితో తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందజేశారు. అనంతరం సీఎం కాన్వాయ్ను ప్రగతి భవన్లోనే వదిలిపెట్టిన కేసీఆర్ ..మేనల్లుడు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కారులో అక్కడ నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్కు వెళ్లిపోయారు.
ఇక రీసెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ని కలిసారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించి, ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని, ఏమి జరుగుతుందో వేచి చూద్దామని సూచించారు. రాజ్యాంగబద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నా ప్రజాతీర్పునకు అనుగుణంగా హుందా వ్యవహరించి తప్పుకున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్లో త్వరలోనే సమావేశమై శాసనసభాపక్షనేతను ఎన్నుకుందామని చెప్పారు.
కేసీఆర్ ఓటమి తర్వాత ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లోని సీఎం అధికారిక నివాసం ఖాళీ చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని 23 తుగ్లక్ రోడ్లో ఉన్న అధికారిక నివాసంతో ఉన్న కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధానికీ తెర పడింది. 2004లో టీఆర్ఎస్ తరుపున కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్.. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ క్యాబినేట్లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సెంట్రల్ మినిష్టర్ హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్లోని టైప్ 8 క్వార్టర్ను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఇప్పటికే ప్రగతి భవన్ను ఖాళీ చేసిన కేసీఆర్.. దిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేస్తామని అధికారులకు సమాచారం అందజేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…