CM KCR : తెలంగాణలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, చివరిగా నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలున్నాయి. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ , బీజేపీలు యత్నిస్తున్నాయి. మరి ఓటరు ఎటున్నాడు, సర్వేలు ఏం చెబుతున్నాయి.. అయితే ఈసారి తెలంగాణ గడ్డపై ఎలాగైనా హస్తం జెండాను ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్…. అందుకు తగ్గటుగానే అడుగులు వేస్తోంది.
బీఆర్ఎస్ ను ఓడించబోతున్నామని… తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అని తేల్చి చెబుతోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకటేనంటూ ఆరోపించటమే కాకుండా… పలు అంశాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం… హంగ్ వస్తోందని సరికొత్త లాజిక్ ను తెరపైకి తీసుకువస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే… సర్వే రిపోర్టులు మాత్రం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఇండియా టుడే – సీ ఓటర్ సర్వేలో….కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా పలు కీలక అంశాలను ఇందులో ప్రస్తావించింది. 119 అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణాలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు వస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తేల్చింది. 2018 ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఈసారి కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని వెల్లడించింది.
గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన బీజేపీ … ఈ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకునే అకాశం ఉందని వివరించింది. 2018 ఎన్నికల్లో ఇతరులు 11 మంది గెలవగా… ఈ ఎన్నికల్లో 8 మంది వరకు గెలవొచ్చని అంచనా వేసింది. ఇక ఓటింగ్ షేర్ విషయానికొస్తే కాంగ్రెస్ బలం భారీగా పెరగనున్నట్లు తెలిపింది ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే. గత ఎన్నికల్లో 28 శాతం ఓట్లను దక్కించుకున్న కాంగ్రెస్… ఈసారి 39 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. గతంతో పోల్చితే 11 శాతం ఓట్లు పెరుగుతాయని సర్వేలో వెల్లడించింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…