ఆచార్య ముందు వరకు వరుస హిట్స్తో దూసుకుపోయాడు కొరటాల శివ. కాని ఆచార్య మాత్రం కొరటాలకి పెద్ద దెబ్బ కొట్టింది. చిరులాంటి స్టార్ హీరోకి కొరటాల ఫ్లాప్ ఇచ్చాడని ఆయనపై పలు సందర్భాలలో ఇన్డైరెక్ట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు చిరు.ఆచార్య నుండి ఇద్దరికి ఏ మాత్రం పడడం లేదని అందుకే కొరటాలని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారని అనుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరజీవి ఆచార్య సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా విషయంలో దర్శకుడు తీసుకునే శ్రద్ధపైనే సినిమా రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంఅందరు ఆచార్య పరాజయానికి కొరటాలే కారణం అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి మెగాస్టార్ ఆచార్య పై కామెంట్స్ చేయడం ఆసక్తికరకంగా మారింది.
నేను అన్నది కేవలం కొరటాల శివని మాత్రమే కాదు. అందరి దర్శకులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన మాటలు అవి. అనవసరంగా కొరటాల శివకి, నాకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. స్క్రీన్ ప్లే అంతా రెడీ అయ్యాకే సెట్స్ పైకి వెళ్ళాలి. ఒక సినిమా అనుకున్న ఖర్చులో అవ్వాలి అన్నా, షూటింగ్ పూర్తి చేసుకోవాలి అన్నాకూడా .. దర్శకుడు వల్లే అది సాధ్యం అవుతుంది. పక్కా ప్రణాళిక లేకుండా 4 గంటల సినిమా తీసేసి, మళ్ళీ దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి 2:30 గంటల సినిమా రిలీజ్ చేస్తే కుదరదు. అది మార్చుకోవాలి అంటున్నా. ఇది కేవలం నేను కొరటాల శివాని దృష్టిలో పెట్టుకొని అనడం లేదు. డైరెక్టర్ ని కెప్టెన్ అఫ్ ది షిప్ అంటాము కాబట్టి, అందర్నీ ఉద్దేశించి అంటున్నా” అంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది.మొత్తానికి థియేటర్స్లో పూనకాలు అయితే లోడ్ అవుతున్నాయి. నిన్న విడుదలైన వీరసింహారెడ్డి కూడా మంచి విజయం సాధించగా నేడు విడుదలైన వాల్తేరు వీరయ్య కూడా పెద్ద హిట్ కావడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…