చిరంజీవి, రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి.. ప్రిరిలీజ్ వేడుకను నిన్న విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి సినిమా అవుట్ పూట్ చూశానని.. అద్భుతంగా వచ్చిందంటూ సినిమాలోని కీలక ట్విస్ట్ లు, పాత్రల తీరుతెన్నులన్నీ లీక్ చేయడం సంచలనమైంది. కేవలం సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ అని.. సినిమా కథ వినగానే బ్లాక్ బస్టర్ అని అర్థమైందని.. చిరంజీవి అన్నారు.
ఇదొక ‘ఎమోషనల్ రోలర్ కోస్టర్’ అంటూ చిరంజీవి తన ‘వాల్తేరు వీరయ్య’ మూవీని ఆకాశానికెత్తేశాడు. రీసెంట్గా రిలీజైన ట్రైలర్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో చిరంజీవి… రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు…..నా పేరు మీదనే రికార్డ్స్ ఉంటాయి అంటూ డైలాగ్ చెప్పారు. అయితే ఇదే డైలాగును కమెడియన్ పృధ్వీ….సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన విన్నర్ సినిమాలో కామెడీగా చెప్పాడు. రికార్డుల్లో నా పేరు ఉండటం ఏంట్రా…నా పేరు మీదనే రికార్డులు ఉంటాయ్…సుజాత సింగం సుజాత అంటూ డైలాగ్ పేల్చాడు. ఈ సినిమాకి గోపిచంద్ మలినేని డైరెక్టర్ కాగా, ఇప్పుడు అదే డైరెక్టర్తో బాబీ పోటీ పడుతున్నాడు.
గోపిచంద్ మలినేని సినిమలోని డైలాగ్ని బాబీ వాల్తేరు వీరయ్యలో వాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా కథక అనుగుణంగా దర్శకులు అలా రాసుకుంటారు. అయితే ఒక్కోసారి కొన్ని డైలాగ్స్ సేమ్ టూ సేమ్ ఉండడం కామన్. ఇప్పుడు చిరంజీవి, బాలయ్య సినిమాల మధ్య గట్టి పోటీ ఉండనున్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ ప్రతి చిన్న పాయింట్ని కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య సంక్రాంతికి దున్యేయడం ఖాయం అని అంటున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…