యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన నటనకి ఫిదా కాని వారు ఉండరు. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. మనం కెమెరాను అతడి కనుబొమ్మ దగ్గర పెడితే.. ఆ కనుబొమ్మతో నటించగలడు. అంత గొప్పగా ఉంటుంది ఇతడి నటన అని రాజమౌళి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎల్లలు దాటుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్.. దేశ విదేశాల్లో సూపర్ క్రేజ్ సంపాదించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ గురించి మంచు లక్ష్మి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ రోల్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అంతర్జాతీయంగా ఎన్టీఆర్ పాపులారిటీ రెట్టింపు కావడంతో పాటు ఇండియన్ ఫిలిం హిస్టరీలోని గొప్ప నటుల్లో ఒకరుగా ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజైన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ 10 ప్లేస్ లో నిలిచారు. ఇది ఎన్టీఆర్ సాధించిన ఓ అరుదైన ఘనత అని చెప్పుకోవాలి. ఒక భారతీయ నటుడు టాప్ 10 ఆస్కార్ ఉత్తమ నటుల అంచనా జాబితాలో చోటు సంపాదించడం ఇదే తొలిసారి. ఎన్టీఆర్కి ఆస్కార్ రావడం పక్కా అని కొందరు జోస్యాలు చెబుతుండగా, మరి కొందరు ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తుతున్నారు.
అయితే విషయమై సినీ సెలబ్రిటీలు పెద్దగా స్పందించినట్లు కనిపించడం లేదు. ఇదే ఇష్యూపై మంచు లక్ష్మి సీరియస్ కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయం కాదు. ప్రపంచ సినిమా చరిత్రలోనే పెద్ద విజయం ఇది. మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదు? అంతా ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ మంచు లక్ష్మి ట్వీట్ పెట్టింది. నిజానికి ఒక్క స్టార్ హీరో, హీరోయిన్ కూడా ఎన్టీఆర్ని అభినందిస్తూ ట్వీట్ చేయలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్ వాళ్లకు మరింత బలాన్ని చేకూర్చినట్టైంది.. ఆమె ట్వీట్ పై పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తూ కరెక్ట్ అంటున్నారు ఫ్యాన్స్.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…