Bus Conductor : తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ బర్త్డేను పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో (ఆర్డినరీ, ఎక్స్ప్రెస్) ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించొచ్చు అని తెలియజేశారు. అయితే ఓ కండక్టర్ మాత్రం మహిళలకి టిక్కెట్లు కొట్టాడు. ఫ్రీ పథకం వచ్చింది కదా అన్నా సరే.. కోపానికొచ్చి మరీ డబ్బులు వసూలు చేశాడు. పథకం ప్రారంభించిన రెండో రోజే కండక్టర్ ఇలా చేయటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు ఎండీ సజ్జనార్. విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది’ అని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, సదరు కండక్టర్పై సంబంధిత డీపో మేనేజర్ సస్పెండ్ చేసినట్లు తెలిసింది. మహిళా ప్రయాణికుల నుంచి 90 రూపాయల ఛార్జీ వసూలు చేసినట్టు తెలుస్తుంది.
మహాలక్ష్మి పథకం కింద వయసుతో సంబంధం లేకుండా మహిళలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేయవచ్చని.. ఇందుకోసం కేవలం వాళ్ల దగ్గర ఏదైనా ఐడీ కార్డు ఉంటే చాలని తెలిపారు. అయితే.. పథకం ప్రారంభమైన మొదటి వారం రోజులు ఐడీ కార్డు కూడా చూపించాల్సిన పని కూడా లేదని తెలిపారు. కాగా.. కండక్టర్ ఇలా చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్టీసీ వ్యవస్థ ఈ పథకం ద్వారా పుంజుకుంటుందన్నారు. ఇలాంటి పథకం వల్ల అందరూ బస్సులో ప్రయాణించడానికి ముందుకు వస్తారని, దానివల్ల ప్రజా రవాణా శాతం కూడా పెరుగుతుందని చెప్పారు సజ్జనార్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…