KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయదుందుభి మ్రోగించిన విషయం తెలిసిందే. ఊహించని సీట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో నిలిచింది. అయితే బీఆర్ఎస్ తరపున 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారిన నియోజకవర్గాల్లో ఒకటైన సిరిసిల్లలో సీఎం కేసీఆర్ కుమారుడు.. కేటీఆర్ వరుసగా ఐదో సారి విజయం సాధించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ పోటీతో సిరిసిల్ల మీద ప్రత్యేక ఫోకస్ ఉంది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా.. ఇక్కడా మొదట కేటీఆర్ వెనుకంజలో ఉండటం గమనార్హం. రౌండ్లు గడుస్తున్న కొద్దీ ఆధిక్యంలోకి వచ్చి చివరగా 29687 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చివరగా 2018లో ఏకంగా 89 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో కేటీఆర్ గెలుపొందడం విశేషం.
అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాని నేపథ్యంలో కేటీఆర్ తమ పార్టీ నాయకులకి ధైర్యం అందించారు. పవర్ పాలిటిక్స్లో గెలుపోటములు సహజమని.. ఓడిపోయామని బాధపడాల్సిన, భయపడాల్సిన పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని రకాలుగా ప్రలోభాలు, కుట్రలు చేసినప్పటికీ సిరిసిల్ల ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమన్న కేటీఆర్.. నిరాశ పడాల్సిన అవసరం లేదని కార్యకర్తలలో ధైర్యం నూరిపోశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీకి పోరాటాలు చేయడం కొత్తేమీ కాదన్న కేటీఆర్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజాగొంతుకై పోరాడుదామని కార్యకర్తలకు నిర్దేశించారు.
ప్రజలు మనకు రెండుసార్లు ఛాన్స్ ఇచ్చారని, ఇది తాత్కాళిక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు.తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్గా అభివర్ణించిన కేటీఆర్.. తెలంగాణ ప్రజానీకం తమను వదులుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు.అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అన్నింటినీ తెలంగాణ ప్రజలు రాసిపెట్టుకున్నారన్న కేటీఆర్.. అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని గెలుపొందడం ఎంతో దూరంలో లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు సిరిసిల్లలో ఓటర్లకు డబ్బులు, మందులు పంచనని మాట ఇచ్చానన్న కేటీఆర్.. ఆ మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. అదే విధంగా రేవంత్ ధైర్యంపై కూడా ఇన్డైరెక్ట్గా కొంత ఆసక్తికరంగా మాట్లాడారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…