BJP : మరి కొద్ది రోజలలో పార్లెమంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో 370 సీట్లను బీజేపీ గెలుస్తుందని ప్రధాని మోదీ లోక్ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే టార్గెట్ తో బీజేపీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. తెలంగాణలో సైతం మొత్తం 17 సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది.
ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. వాస్తవానికి మార్చి 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆదిలాబాద్ లో బహిరంగసభ. మార్చి 4 రాత్రి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో బస. మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటన. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆ తర్వాత బహిరంగసభ. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనం ఉంటుంది.బీజేపీ మాత్రం బీఆర్ఎస్ పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పొలిటికల్ గేమ్ మొదలు పెట్టింది. తాజాగా నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములుని తమవైపు లాక్కుంది. మరింతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఈ సారి పలు చోట్ల కొత్త ముఖాలని బరిలోకి దింపాలని బీజేపి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.గత ఎన్నికలలో పని చేసిన వారు ఇప్పుడు కనిపించకపోవచ్చు. అలానే పార్టీలో కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇవ్వొద్దని హైకమెండ్ చెప్పినట్టు సమాచారం.బీజేపీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన వారికి సీట్లు ఇవ్వాలని , ఈ క్రమంలో 10 స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇచ్చేలా బీజేపీ అనుకుంటుందట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…