Bandla Ganesh : కమెడీయన్ గా కన్నా, పవన్ భక్తుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు బండ్ల గణేష్. రాజకీయాల కారణంగా వ్యక్తిగతంగా చాలా నష్టపోయినట్లు సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ సందర్భంలో తెలియజేశాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన బండ్ల గణేష్.. 3-4 ఏళ్ల క్రితం తెలంగాణ లో చాలా యాక్టీవ్గా కనిపించాడు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్తో గొంతు కోసుకుంటానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో బీరాలు పలికాడు. కానీ..ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. దాంతో కొన్నాళ్లు మీడియాకి దూరంగా ఉన్నాడు.
ఇక ఇదిలా ఉంటే బండ్ల గణేష్ రీసెంట్గా రాజకీయాల కారణంగా జీవితంలో చాలా నష్టపోయాను. నాకు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే అని ఓనెటిజన్ కి రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్.. కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నవారే.. రాజకీయాల్లోకి రావాలి లైక్ అవర్ బాస్ అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావించగా, దానికి బండ్ల గణేష్.. నాకంత స్థాయి లేదు.. అంత గొప్పవాడిని కూడా కాదు సోదరా అని రిప్లై ఇచ్చాడు. పవన్కి రాజకీయాలలో వెన్నంట నిలుస్తాడని అందరు ఊహించగా, మనోడు ఇలా కామెంట్స్ చేసే సరికి అందరు ఆశ్చర్యపోయారు.
పవన్ కళ్యాణ్ భక్తుడిగా.. బండ్ల గణేష్ ఆయన్ని డిపెండ్ చేస్తూ ఉంటాడు. పవన్ ని ఎవరైనా విమర్శిస్తే వెంటనే రియాక్ట్ అవుతాడు.అలాంటి బండ్ల గణేష్ ఎవరితో గొడవులు పెట్టుకోకుండా మంచోడిలా ఉంటానని చెప్పడంతో ఫ్యాన్స్ నీరసించి పోయారు. బండ్ల జనసేనలో చేరి పవన్కి అండగా ఉంటే ఆ ఎనర్జీ వేరే లెవల్లో ఉండేది కాని ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరుత్సాహపరుస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానం అందలేదని దర్శకుడు త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టడంతోఈయనని దూరం పెట్టాడట పవన్. ఇక బండ్ల కూడా పవన్పై చాలా కోపంగా ఉన్నాడని టాక్ నడుస్తుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…