Bandla Ganesh : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంత ప్రభంజనం సృష్టించాయో మనం చూశాం. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా ఓటమి చెందడంతో ఆమెపై విమర్శలు కురిపించారు బండ్ల గణేష్. ‘జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. తద్వారా రాజకీయాలకు సెలవు ఇచ్చేసి.. మళ్లీ టీవీ షోలు చేసుకో అంటూ కొద్ది రోజుల క్రితం సలహా ఇచ్చాడు బండ్ల గణేష్.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి రోజాపై విరుచుకుపడుతున్నాడు బండ్ల గణేష్. తాజాగా ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ పోటీలలో రోజా రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ కథనాలు వస్తుండటంతో బండ్ల గణేష్ స్పందించారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రోజా నూటికి నూరు శాతం స్కాం చేసే ఉంటుందంటూ ఆరోపించారు. ఇతరుల గురించి తెలియకుండా మాట్లాడనని.. స్కాముల్లో ఆమె డైమండ్ రాణి అంటూ బండ్ల గణేష్ సెటైర్లు వేశారు. బండ్ల గణేష్ ఎవరో తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందని.. రోజాకు ఎదురు చెప్పేవాళ్లు ఉండకూడదా అని ప్రశ్నించారు. ఒక్క 100 కోట్లే కాదు.. ఆవిడపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని బండ్ల గణేష్ డమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించినందుకు డబ్బులు వసూలు చేసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడంటూ ఆమె నవ్వుకునేదని.. అసెంబ్లీ గేటును కూడా టచ్ చేయలేడని రోజా మాట్లాడిందని బండ్ల గణేష్ మండిపడ్డారు. కానీ ఇప్పుడు పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచిన ఏకైక నాయకుడు పవన్ అని ఆయన స్థాయికి కొంచెం తగ్గే ఉన్నారని గణేష్ తెలిపారు. రోజా లాంటి నేతలంతా కలిసి జగన్ను ట్రాన్స్లో పెట్టారని.. నువ్వు దేవుడన్నా అంటూ మోసేసి చివరికి ఈ స్థితికి తీసుకొచ్చారని బండ్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…