Balakrishna : చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య ఏపీ రాజకీయాలలో చాలా యాక్టివ్ అయ్యారు. మొన్నటి వరకు సినిమాలతో బిజీగా ఉంటూ వస్తున్న బాలయ్య.. ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఏపీ రాజకీయాలలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఇటీవల అసెంబ్లీ సభలో నందమూరి బాలయ్య విజిల్ వేస్తూ నానా రచ్చ చేశారు. ఆయన అలా విజిల్ వేయడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి పద్దతి సరికాదన్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారని.. సీటు ఎక్కి ఎందుకు ఆ సీట్లో కూర్చోమంటూ బాలయ్యకు చురకలు అంటించారు అంబటి.
ఎవరు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నా కూడా బాలకృష్ణ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆయన టీడీపీ కార్యకర్తలతో కలిసి సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ గట్టిగా గట్టిగా అరుస్తున్నారు. అలానే రోడ్ల మీదకి ప్లక్కార్డులు పట్టుకొని వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్లో అరాచకపోవాలని అన్నారు. మొత్తానికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ బాలకృష్ణ బాగా కోపిష్టి అన్నవిషయం ఆయన వ్యవహారతీరును బట్టి తెలుస్తుంది. చివరకు నిత్యం ప్రజల్లో వుండాల్సిన రాజకీయ నాయకుడిగానూ బాలకృష్ణ తీరులో మార్చులేదు.
ఇటీవల టిడిపి అనుకూల మీడియా ప్రతినిధిపైనే బాలయ్య ఆవేశంగా చిందులుతొక్కారు. . బావ చంద్రబాబు ఇప్పటికే అరెస్టవగా అల్లుడు లోకేష్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో బాలకృష్ణ సహనం కోల్పోతున్నారని… అందువల్లే ఇలా ప్రవర్తించివుంటారని పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ పలువురిపై చేయిచేసుకున్న ఘటనలు సంచలనంగా మారాయి. నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలపైనే కాదు వ్యక్తిగత సిబ్బందిపైనా బాలకృష్ణ చేయిచేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.. ఇక కోపం వస్తే బాలకృష్ణ నోటివెంట బూతులు వస్తుంటాయని సినిమావాళ్ళు చెబుతుంటారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…