Balakrishna : తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. అయితే బాలయ్య చాలా కోపిష్టి అని కొందరు అంటుంటే మరి కొందరు చిన్న పిల్లాడి మనస్తత్వం అని అంటుంటారు. ఒక్కోసారి ఏదైనా కార్యక్రమం కోసం బయటకు వచ్చినప్పుడు అభిమానులు, అక్కడి వాళ్లతో ప్రవర్తించే తీరు చూస్తే బాలయ్య కోపం ఏ రేంజ్లో ఉంటుందో అర్ధం అవుతుంది. ఒక్కోసారి అభిమానులపై ఆయన చేయి కూడా చేసుకుంటారు. అలా ఆయన చేతితో దెబ్బలు తిన్నవాళ్లు చాలామందే ఉన్నారు.
తాజాగా బాలయ్య తను నటించిన ‘వీరసింహారెడ్డి‘ మూవీ ప్రీ రిలీజ్ వేడుక కోసం ఒంగోలు వెళ్లగా అక్కడ బాలయ్యను చూసేందుకు ఒంగోలు జనాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నందమూరి ఫ్యాన్స్ భారీ ఎత్తున పాల్గొన్నారు. అయితే. భారీ జనం మధ్య నడుచుకుంటూ వస్తున్న బాలయ్యని చూసిన ఓ ఫ్యాన్ .. ఆయనను శాలువాతో సత్కరించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిమాని శాలువా కప్పుతుండగా.. బాలయ్య తలపై ఉన్న కళ్ళజోడు కిందపడిపోయింది. దీంతో బాలయ్య చిరాకు పడుతూ.. అవతలికి పో.. అని విసుక్కున్నాడు. ఇది చూసి కొందరు బాలయ్య కోపం తగ్గించుకోవా అని కామెంట చేస్తున్నారు.
బాలయ్య కోపం గురించి ఆయన చేయి చేసుకోవడం గురించి ఇటీవల రచయిత సాయి మాధవ్ బుర్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలయ్య ఓ సందర్భంలో నాకు అభిమానులపై చేయిచేసుకోవడం గురించి చెప్పాడు. నాకు, అభిమానులకు మధ్య ఎవరూ ఉండకూడదు. వాళ్లు నా కుటుంబం. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టడంలో తప్పులేదు. వాళ్లను కొడితే గిడితే నేనే కొడతా. అసలు హీరోలు బౌన్సర్లను పెట్టుకోవడం ఏంటి’’ అని అన్నారట బాలయ్య. బాలయ్య చెప్పిన సమాధానం సాయిమాధవ్కు చాలా నచ్చిందట. మరి ఈ విషయం ఓపెన్గా చెప్పొచ్చు కదా అని అంటే.. ‘నాకా అలవాటు లేదు. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు’ అని బాలయ్య అన్నారట. ‘వీరసింహారెడ్డి‘ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుండగా, మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…