Roja : ఏపీలో పొలిటికల్ వ్యవహారం రోజురోజుకి హీటెక్కిపోతుంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. మంత్రి హోదాలో మెగా బ్రదర్స్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పవన్కు అసలు మానవత్వం లేదు. ఎమోషన్స్ లేవు. ఆయన నా తోటి ఆర్టిస్టు అయినందుకు సిగ్గుపడుతున్నాను. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్లు తమకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన ప్రజలకు సేవ చేశారు’ అన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులు తమను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు చిన్న సహాయం చేయలేదు. అంతెందుకు వీళ్లు ముగ్గురూ సొంత జిల్లాకు ఏమీ చేయలేదు. అందుకే అన్నదమ్ముల ముగ్గురినీ సొంత నియోజకవర్గ ప్రజలే ఓడించారు. రాజకీయాల్లో ఈ ముగ్గురికి అసలు భవిష్యత్ అనేది లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నాగబాబు, జబర్ధస్త్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ హెచ్చరిస్తూ ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టాడు గెటప్ శ్రీను. చిరంజీవి గారి సేవా గుణం.. దాన గుణం.. తెరిచిన పుస్తకం.. ఆయన ఒక స్ఫూర్తి.. మరి మీకెందుకు కనపడలేదో ? రోజాగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు.. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’ ఇట్లు చిరంజీవి అభిమాని అంటూ పోస్ట్ పెట్టాడు గెటప్ శ్రీను.
ఇక నాగబాబు.. రోజాపై నిప్పులు చెరిగారు. ‘మంత్రి రోజా.. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్లో ఉన్న 20 స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్లు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 18లో ఉంది. నువ్వు ఇలాగే బాధ్యత లేకుండా ఉంటే మరింత దిగజారి 20కి చేరుతుంది’ అని హెచ్చరించారు. ‘ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. కాబట్టి నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు’ అని చెప్పారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…