Balagam Soudamini : జబర్ధస్త్ ఫేమ్ వేణు తెరకెక్కించిన చిత్రం బలగం. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతో ఎమోషనల్కి గురి చేసింది. సహజత్వానికి దగ్గరగా మానవ సంబంధాలను వెండితెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ వేణు ఎల్దండి సక్సెస్ అయ్యాడు. ఈ మూవీలో హీరో ప్రియదర్శి తాత శవం దగ్గర రొమాన్స్ చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది కదా. చావు ఇంట్లో తనకు కాబోయే భార్యకు మర్యాదలు చేయడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రియదర్శిని చేసుకోబోయే అమ్మాయిగా సౌధామిని నటించింది. సౌధామినికి ఇదే మొదటి చిత్రం కాగా, ఇందులో బొద్దుగా ఉన్న సౌధామిని ఎక్స్ప్రెషన్స్ నవ్వు తెప్పిస్తాయి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా సౌధామిని తన నటనతో ఆకట్టుకుంది.
బలగం సినిమాలో పెద్దగా సీన్లు పడకపోయినా.. స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా కూడా ఉన్న కొద్ది సేపు కూడా తన సిగ్గుతో ఇన్నోసెంట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు సౌధామని. కేవలం ఆకట్టుకోవడమే కాదు..ఆమె అందరిని నవ్వించింది. అయితే బలగం సినిమా సూపర్ హిట్ కావడం, ఇందులోని ఆర్టిస్ట్లకి వరుస అవకాశాలు వస్తుండడం జరుగుతుంది. బలగం సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో సౌధామినికి మరొక సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈసారి ఏకంగా ఓ అగ్రదర్శకుడి సినిమాలోనే కీ రోల్ లో నటించేందుకు ఛాన్స్ కొట్టేశారు.
సినిమాల్లో నటించాలనే కోరికతో టాలీవుడ్ లో ఆర్టిస్టుగా రాణించాలనే ఆశతో ఉన్న సౌధామిని.. బలగం మూవీలో తనకు వచ్చినటువంటి అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకుంది. ఈ సినిమా కోసం సౌధామిని 10 కేజీలు వెయిట్ పెరిగారట. తనకు దొరికిన ఆ చిన్న పాత్రలో మనస్సు పెట్టి నటించి అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ జాతీ రత్నాలు దర్శకుడి నుంచి నేరుగా ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు. జాతి రత్నాలు సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకు అనుదీప్.. తాజాగా బలగం ఫేమ్ సౌధామినికి కాల్ చేసి అప్రిషియేట్ చేయడమే కాక తన తరువాతి సినిమాలో ఓ ముఖ్య పాత్ర ఇస్తానని మాట కూడా ఇచ్చారట. ఇక ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌధామిని చెప్పుకొచ్చింది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…